Navasakam News Network Telugu News Updates – Andhra Pradesh & Telangana

19/10/2020

కొల్లేరు ప్రాంత ప్రజలకు అండగా వుంటా – నత్తగుళ్ళపాడు పర్యటనలో DNR.

Filed under: DNR MLA,Kaikaluru,Latest News,News — Tags: , , , , — Navasakam Media @ 13:57

ముంపునకు గురి అయిన కొల్లేటి గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని కైకలూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు.

ఈరోజు గుడివాడ DLPO వరప్రసాద్, ఫిషరీస్ AD వర్ధన్, డ్రైనేజీ AEE ఇందిరా, రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, PHC డాక్టర్ వేణు, డా.శంకర్, RWS AEE నాగబాబు, PR AEE బాషా, ఫారెస్ట్ అధికారులు, R&B అధికారులు, ఎంపీపీ అభ్యర్థి అడవి కృష్ణ, కొల్లేటి నాయకులు నబిగారి రాంబాబు, వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రీ సంతోషి, VROలు, ఆశ వర్కర్స్, గ్రామ సెక్రటరీలు, పార్టీ నాయకులతో కలసి , కొల్లేరు లంక గ్రామాల పర్యటనలో భాగంగా నత్తగుళ్లపాడు గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్బంగా స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో MLA DNR గారు మాట్లాడుతూముంపుకు గురి అయిన మీ నత్తగుళ్లపాడు గ్రామానికి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు అందరం వచ్చాము అని మీ అందరికి ప్రభుత్వం తరుపున పూర్తి అండగా ఉంటాం అని అలాగే మీ యొక్క గ్రామంలో పూర్తిగా శానిటేషన్ చేయిస్తున్నాం అని మత్యకారులకు ప్రభుత్వం తరుపున సాంప్రదాయ వేటకు ఎదురు గడలు కూడా ఇస్తాం అని అన్నారు అలాగే ప్రభుత్వం నుంచి పశువుల దాణా కూడా వచ్చేలాగా చర్యలు తీసుకుంటాం అని అలాగే ఎవరికీ ఇబ్బందులు లేకుండా గ్రామాలలో మెడికల్ క్యాంపులు పెడుతున్నారు అని అన్నారు అలాగే C.C రోడ్లు పక్క డ్రైనేజీ పనులు ప్రారంభిస్తాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, EO, PRD గారు, R.I ప్రసాద్ గారు,సెక్రటరీలు, తోట శ్రీనివాసరావు, కిరణ్ YSRCP నాయకులు, మహ్మద్ జహీర్, షేక్ రఫీ, నిమ్మల సాయి, మంగినేని రామకృష్ణ, కాటికాన రఘు, నిమ్మల శ్రీనివాస్, కూనవరపు సతీష్, పాణెం కిరణ్ కాసులు తదితరులు పాల్గొన్నారు.

Powered by WordPress