-తిండి లేక మూగజీవాల వేట
ఈటానగర్ : దేశవ్యాప్త మూసివేతతో పనుల్లేక ప్రజలు ఆకలికి అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రాతి నిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ముసాహర్లకు చెందిన పిల్ల లు గడ్డి తినగా.. బీహార్లోని ఓ ప్రాంతంలో చిన్నారులు కప్పలు తింటున్న వీడియోలు ఇటీవల సోషల్మీడియాలో వైరల య్యాయి. ఇక తాజాగా గిరిజన ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్లో ఆకలికి తాళలేక పలువురు కింగ్ కోబ్రాను వేటాడారు. రాష్ట్రం లోని ఓ అటవీ ప్రాంతంలో కొంతమంది కింగ్కోబ్రాను చంపి దాన్ని కోస్తున్న వీడియో ఒకటి బయటకొచ్చింది. ఆ వీడియోలో వారు మాట్లాడుతూ.. కొద్దికాలంగా తమకు తినడానికి తిండి లేదనీ, అడవికి వెళ్లి దేన్నైనా వేటాడి కడుపు నింపుకుంటున్నామని చెప్పారు. కింగ్ కోబ్రా దొరకడంతో దీన్ని పట్టుకొచ్చామని అన్నారు. అయితే దీనిపై అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం స్పందిస్తూ.. తమ రాష్ట్రంలో ఎవరూ ఆకలితో లేరనీ, మూడు నెలలకు సరిపడా ఆహార నిల్వలు తమ దగ్గర ఉన్నాయని తెలిపింది. అందరికీ రేషన్ అందజేశామని వివరించింది.
Courtesy: NT