Kaikaluru MLA Sri Dulam Nageswarao Garu speaking at Eighth Session of XV Legislative Assembly Day 11 on 23-03-2022
కైకలూరు నియోజకవర్గం ప్రజలందరి తరుపున గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గారు అసెంబ్లీ లో అన్నారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీలో MLA DNR గారు మాట్లాడుతూ మా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరు పైన రెగ్యులేటర్, ఉప్పుటేరు శివారు సముద్ర ముఖ ద్వారం చిన్న గొల్లపాలెం వద్ద రెగ్యులేటర్, గరిసిపూడి పెద్దలంక డ్రైన్ డబుల్ లైన్ బ్రిడ్జి నిర్మాణాలకు, గౌరవ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి గారు 452 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు, ఈ రెగ్యులేటర్ల నిర్మాణం వలన మా కైకలూరు నియోజకవర్గంతో పాటు, ఉండి, బీమవరం, పెడన, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గలకు మంచి శుభపరిణామం అని అన్నారు,, ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి YS జగనన్న ప్రజాసంకల్పపాదయాత్రలో భాగంగా కైకలూరు నియోజకవర్గం వచ్చినపుడు మా ప్రాంత కొల్లేరు ఇబ్బందులను, అదేవిదంగా గరికిపూడి అండర్ టెన్నల్ ఇబ్బందులు తెలియజేసాము అని, ప్రభుత్వం రాగానే రెగ్యులటర్లు నిర్మాణం చేదాం అని హామీ ఇచ్చారు, ఇచ్చిన మాటకు కట్టుబడి 452 కోట్ల రూపాయలు మంజూరు చేశారు అని అన్నారు. మా కృష్ణాజిల్లాలో కృతివెన్ను ,బంటుమిల్లి, కలిదిండి, ముదినేపల్లి, గుడ్లవల్లేరు మండలాల రైతులకు శుభ పరిమాణం అధ్యక్ష అని MLA గారు తెలిపారు.