” జోలాలీ పాడాలి
జోలాలీ పాడాలీ…
ఈ జోల పాటతో పాపాయీ
ఆపాలి నీ గోల పాపాయీ… ”
“అమ్మను రమ్మని, పాలిచ్చి పొమ్మని, కాకితో కబురంపాను, ఆ కాకి చేరలేదో, కామందు పంపలేదో, మన అమ్మ రాలేదు, ఏడుపెక్కువయ్యే, అది వెక్కి వెక్కి ఏడ్చే…”
ఎన్ని మీటింగుల్లో పాడుకున్నామో
నీ పాట ఎన్ని గుండెలను తడిపిందో
ఎన్ని పసి మనసులను ఓదార్చిందో..
ఏడుపు వస్తుంది…ఊసా…ఏ కాకితో కబురపాలి…నిన్ను తీసుకు రమ్మని…
నీ అంతిమ యాత్రలో కూడా పాల్గొనలేని దుస్థితి. తీరని దుఃఖాన్ని మిగిలించింది.
నీవు లేవన్న కఠోర సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.
– సంధ్య, పీఓడబ్ల్యూ
దళిత బహుజనుల గళమై
ఉద్యమపథంలో దిశానిర్దేశం చేసిన యోధుడు..
పీడిత కులాల బాగుకోసం జీవిత పర్యంతం
తపించిన అవిశ్రాంత పథికుడు..
లోతైన విశ్లేషణతో అన్ని రకాల వివక్షలపై
ధిక్కార ప్రకటన చేసిన దార్శనికుడు…
మా నాయకుడు..
ఉ.సా. ఇక లేరు…
అయ్యో సారూ… ఎంత ఘోరమిది..!
ఈ దుఖం ఎడతెగనిది..
మీరు లేని లోటు పూడ్చలేనిది..
-రమేశ్ ఒమ్మి, కవి
బతుకంతా బడుగు జీవుల కోసం తపన పడ్డ మేధావి..
దేశీ దిశ అనే చానల్ ద్వారా సమాజ అంతరాలపై సమర శంఖం
పూరించిన ఉద్యమాల ఉపాధ్యాయుడు
‘ఉసా’గా ప్రఖ్యాతి గాంచిన ఉ.సాంబశివరావు గారు కరోనాతో మృతి చెందడం భాదాకరం.
వారికి అశ్రునివాళి….
– శ్రీనివాసరావు సజ్జా
ఉసా గారి మరణం షాకింగ్ గా ఉంది. బహుజన ఉద్యమానికి తీరని లోటు! అణగారిన వర్గాల ప్రజల పక్షాన జీవిత కాలం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు, ఈ కాలపు మహామేధావి. ప్రజా త్రంత్ర ఉద్యమాలకు పెద్ద దిక్కు అయిన ఉసా గారు కూడా కరోనా కు బలై అకాల మరణానికి గురియ్యారు.. వారి మరణానికి తీవ్ర సంతాపం తెలియ చేస్తున్నాం..
– దొంతా సురేష్, రాష్ట్ర అధ్యక్షుడు, బహుజనప్రజా చైతన్య వేదిక, ఆంధ్రప్రదేశ్