ఖమ్మం: ఖమ్మం జిల్లాలో పెనుబల్లి మండలంలోని తహశీల్ధార్ కార్యాలయం ఎదుట ఓ వృద్ధురాలు పురుగు మందు డబ్బాతో ధర్నాకు దిగింది. మండలంలోని రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ అనే వృద్దురాలు.. పాసు పుస్తకాలు మంజూరు చెయ్యడంలో తాహశీల్దార్ జాప్యం చేస్తూన్నారంటూ ఎమ్.ఆర్.ఒ. ఆఫీస్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తనకు సంబధించిన ఆరు ఏకరాల భూమి విషయంలో పాస్ పుస్తకాలు జారీ చెయ్యకుండా అక్కడి అధికారులు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారని వృద్దురాలు రోదిస్తున్నది.
Courtesy V6velugu