తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ప్రియాంకను లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు కలిసి హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు.. ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లిన నిందితులు అక్కడే అత్యాచారం చేశారని.. ఆ తరువాత శరీరానికి దుప్పటి చుట్టి కిరోసిన్తో కాల్చి చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాసేపట్లో వీరిని మీడియా ముందుకు తీసుకురానున్నారు. కాగా.. ప్రియాంకా కేసులో నిందితులైన.. నలుగురి ఫొటోలను పోలీసులు రిలీజ్ చేశారు.
Courtesy tv 9