అనేకమందిని చంపుతున్నట్టుగానే ఊ.సా.ను కూడా రాజ్యమే అత్యంత అమానవీయంగా చంపింది. బహుజన దళిత ఉద్యమ మేధావి ఉపాధ్యాయుడు ఊసా గారి ఊపిరాగి పోయింది. ఇన్నాళ్లూ సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి కరోనాకి బలైపోయాడు. ఉద్యమాల సారథి మరణం తెలుగు సమాజానికి తీరని లోటు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిపే విద్య- నిరుద్యోగం, సామాజిక, రాజకీయ, కుల అణచివేత, నిర్బంధం, రాజ్యహింస, పీడిత ప్రజల సమస్యల పై చర్చ కార్యక్రమానికి పిలువగానే తప్పకుండా వస్తాను అని సమయాన్ని కేటాయించి గత ఉద్యమాల చరిత్రను బోధించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని సూచించే వారు.. పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా అయిన ఊ సాంబశివరావు గారికి ఉస్మానియా విద్యార్థుల కన్నీటి జోహార్లు..
-కోటా శ్రీనివాస్, ఓయూ
జోహార్… ఊసా గారికి…
బహుజన, దళిత ఉద్యమ మేధావి, ఉపాధ్యాయుడు ఊసా గారి ఊపిరాగి పోయింది. ఇన్నాళ్లూ సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి కరోనాకి బలిపోయాడు…!! ఉస్మానియా యూనివర్సిటీలో జరిపే విద్య- నిరుద్యోగం, సామాజిక, రాజకీయ, కుల అణచివేత, నిర్బంధం, రాజ్యహింస, పీడిత ప్రజల సమస్యల పై చర్చ కార్యక్రమానికి పిలువగానే తప్పకుండా వస్తాను అని సమయాన్ని కేటాయించి గత ఉద్యమాల చరిత్రను బోధించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని సూచించే వారు..
మీ అనుభవం మాలాంటి యువతరానికి భవిష్యత్తు ఉద్యమ పాఠాలను నేర్పింది.. సెమినార్లలో చర్చావేదికలో మీరు లేవనెత్తే అంశాలు… అనేకమంది మెదడ్లను కదిలించేవి… అనర్గళంగా ప్రతి అంశంపై మీరు మాట్లాడే ప్రతి మాట మేము చేసే పోరాటాలకు ఆయుధం అయ్యేది…!! ఉద్యమ అనుభవం కలిగిన మీ లాంటి మేధావిని కోల్పోవడం నేటి సమాజానికి… విద్యార్థి ఉద్యమ నాయకత్వానికి తీరనిలోటు…!! పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా అయిన ఊ సాంబశివరావు గారికి ఉస్మానియా విద్యార్థుల కన్నీటి జోహార్లు..