ఆత్మకూరు : ‘‘ఎంటెక్ చదివినా ఉద్యోగం రావడం లేదు.. తండ్రి భారంగా మారాను.. బతకాలని లేదు. అమ్మానాన్నలను మంచిగా చూసుకోండి.. నేను చనిపోతున్నా’’ అని చెల్లెలికి ఫోన్ చేసిన ఓ యువకుడు పురుగుల మందు తాగాడు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన మెతె ప్రశాంత్(25) హైదరాబాద్లో ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
లాక్డౌన్ విధించడంతో ఇంటి వచ్చాడు. హన్మకొండలో ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.