* ఇద్దరు మృతి
కోల్కతా : ఉత్తర బెంగాల్ కుచ్బెహర్ జిల్లాలో ఆవులను వ్యానులో తరలిస్తున్న ఇద్దరిపై కొందరు సాయుధులు మూక దాడి చేయడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ప్రకాష్దాస్, రబివుల్ ఇస్లాంగా పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి మాతాబంగా వద్ద వీరిద్దరూ రెండు ఆవులను వ్యాన్లో తరలిస్తుండగా, సాయుధ మూక వ్యాన్ను ఆపి ప్రశ్నించింది. అనంతరం వారిపై దాడికి పాల్పడటంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరినీ పోలీసులు ఆసుపత్రిలో చేర్చగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే మూక దాడుల నిరోధక చట్టం బిల్లును పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించాల్సి ఉంది.
Courtesy prajasakthi..