బెంగళూరు : దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై పెత్తందారుల ఆగడాలకు అంతే లేకుండా పోతున్నది. వారం రోజుల క్రితం మధ్యప్రదేశ్, గుజరాత్లలో చోటు చేసుకున్న ఘటనలు మరువక ముందే.. పెత్తందారులకు చెందిన వ్యక్తి బైక్ను ముట్టుకున్నాడనే అక్కసుతో దళిత కుటుంబాన్ని చిత కబాదిన అమానుష ఘటన కర్నాటకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడురోజులక్రితం విజయపుర జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మినాజికి చెందిన దళిత వ్యక్తి.. తలికోటిలో పెత్తందారీవర్గానికి చెందిన వ్యక్తి ద్విచక్రవాహనాన్ని అనుకోకుండా ముట్టుకు న్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి .. అక్కడే ఉన్న తన వర్గానికి చెందిన మరో 15 మందిని పిలిచి దళితుడిని చితకబాదాడు. అతడి కుటుంబంపైనా దాడి చేశారు. బాధితుడిని రోడ్డు మీద పడేసి కడుపులో గట్టిగా తన్నుతూ, కర్రలతో గొడ్డును బాదినట్టు బాదారు. తనను విడిచిపెట్టా లని దళితుడు వేడుకున్నా వినలేదు.
Courtesy: NT