రంగనాయకమ్మ
– 3 –
సిద్దార్ధ మీద దాడి చేసిన పెద్ద గుంపులో, కొందర్ని మాత్రమే ప్రియాంకా వాళ్లు దూరం నించి పోల్చారు. వాళ్లు, గోపాల్ బంజేవర్, సక్రు బంజ్వర్, శివశరణ్, కన్హాయ.., జగదీష్…,-వాళ్లే కనపడ్డారు. ప్రియాంకా వాళ్లు, దాడి చేసిన వాళ్లలో తమకు కనపడ్డవాళ్ల పేర్ల ని, సిద్దార్ధ తమ్ముడైన రాజేంద్రకి చెప్పారు. ఆ మర్నాడే రాజేంద్ర తన అన్న మీద జరిగిన దాడి గురి ంచి, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ పోలీ సుస్టేషన్ నించి, ఒక కానిస్టేబులూ, హెడ్ కానిస్టేబు లూ, ఆ కేసులో సాక్ష్యాల కోసం, సురేఖా, ప్రియాం కల దగ్గిరికి వచ్చారు. వాళ్ల మాటలు నమోదు చేసు కున్నారు. అయినా, ఆ కేసు వల్ల ఏమీ ప్రయోజనం జరగలేదు. ప్రియాంకా వాళ్లు, పోలీసులతో ఎవరెవరి పేర్లని నేరస్తులుగా చెప్పారో, ఆ నేరస్తుల పక్షాన, ఆ తాలూకా బీజేపీ అధ్యక్షుడైన భాస్కర్ కాదవ్తో, ఖైర్లా ంజీ సర్పంచ్ ఒకరూ, ఉప సర్పంచ్ ఒకరూ, దళితుల మీద తీవ్రంగా కలగజేసుకున్నారు. సురేఖా, ప్రియాంకాలు, పోలీసుస్టేషన్కి వచ్చినప్పుడు, ఆ సర్పంచి పెద్దలు, ఆ దళిత స్త్రీలని పోలీసుల ముందే ‘మిమ్మల్ని చంపి పారేస్తాం’ అన్నారు. కండ్రీ గ్రామం లో, సిద్దార్ధని కూడా అలాగే బెదిరించారు. ఆ బెదిరిం పులు, పోలీసుల ముందే జరిగినా, పోలీసులేమీ పట్టి ంచుకోలేదు. కానీ, సెప్టెంబరు 16న, సురేఖా, ప్రి యాంకల సాక్ష్యాల ఆధారంగా, పోలీసులు, సిద్దార్ధని కొట్టిన వాళ్ల మీద కేసుని లాంఛన ప్రాయంగా నమో దు చేశారు. అరెస్టులు అయితే, వెంటనే ఎవ్వర్నీ చె య్యలేదు. నిజ నిర్ధారణ కమిటీ వారు, ఆ విషయా లన్నీ సేకరించడం తర్వాత రోజుల్లో జరిగింది. పోలీస్స్టేషన్ ఇన్చార్జి భరానీ, ఆ కేసుని, ఎస్సీ, ఎ స్టీల వారిపై అత్యాచారాలు జరగకుండా నిరోధించే చట్టం ప్రకారం నమోదు చెయ్యలేదు. అలా ఎందుకు చెయ్యలేదని అడిగిన వారికి, ఏ జవాబూ రాలేదు. నేరాల్ని నిర్ణయించే చట్టాలు, గడుసు గడుసుగా ఈ విధంగా ఉంటాయి. ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి, అల్లర్లు చేసిన దాడి, అల్లర్లను రేపిన దాడి, చట్ట వ్యతిరేకంగా గుమి గూడడం – ఈ రకంగా, నేరాల కు తమాషా వర్ణనలు ఉంటాయి. ఏ దాడిలో అయి నా ఆ లక్షణాలన్నీ దాదాపుగా కలిసే ఉంటాయి. ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరిగితే, ఆ నేరాల్ని చెప్పే చట్టం కూడా వుంది. నేరాల్ని, ఆ చట్టం ప్రకారం న మోదు చేస్తే, ఆ నేరస్తులకు బెయిల్ రాదు. అందుకే, ఎస్సీ, ఎస్టీల్ని బాధించే చట్టాల మీద, పోలీసులు ఏ కేసునీ నమోదు చెయ్యరు. దాడులు జరిగితే, ఆ దాడులు చేసిన నేరస్తుల మీద పెట్టిన కేసులు, ఏ చ ట్టాల ప్రకారం నడవాలో, ఆ చట్టాల ప్రకారం ఉం డవు. సిద్దార్ధ మీద దాడీ, ఆ కేసూ, జరగడంతో, ఖైర్లా ంజీ గ్రామం, నివురుకప్పిన నిప్పులా అయిపోయింది! ఈ కేసులో, 12 మంది ఓబీసీ నేరస్తులకు అరెస్టులు జరిగాయి. ఆ సంఘటనతో ఓబీసీల క్రోధాలు పెరిగిపోయాయి. మాంగే కుటుంబంపై దాడి తప్పదనే ప్రచారం, గతం కన్నా బట్టబయలుగా ఊరంతా సాగుతోంది. మాంగే కుటుంబాన్ని రక్షించా లని, దళితులే అయిన పోలీసులకు శ్రద్ధ ఉంటే, ఆ కుటుంబానికి ఎంతో కొంత రక్షణ దొరికేదే. కానీ, అది జరగలేదు. సిద్దార్ధ త మ్ముడు రాజేంద్ర మీద కూడా, సెప్టెంబరు 21న, దాడి జరగబోయింది గానీ, రాజేంద్ర తప్పించుకున్నాడు. ఈ దాడి మీద ఏ కేసూ లేదు. సిద్దార్ధ మీద చేసిన దాడి వల్ల, కొంత కాలం తర్వాత అరెస్టు అయిన నేరస్తులు, రేపో మాపో విడుదలై పోతారని, గ్రామం లో అందరికీ తెలుసు. ఆ నేరస్తులు విడు దలవడం, రేపో మాపో దాకా ఆగలేదు. ఆ నేరస్తుల అరెస్టులూ, విడుదలలూ, అన్నీ కా యితాల మీద మాత్రమే జరిగి, నేరస్తులకు బెయిల్ దొరికిపోయి, కొన్ని గంటల్లోనే విడుదలలు జరిగి పోయాయి. ఆ నేరస్తులు, అసలు జైళ్లల్లోకి వెళ్లనే లేదు! ‘అరెస్టులు’ అని చెప్పిన కోర్టు, కొంత సేపటికి, ‘విడుదలలు’ అని కూడా చెప్పేసింది.
నేరస్తులు జైళ్లల్లోకి వెళ్లకపోయినా, ‘అరెస్టులు’ అనే తీర్పుతో అవమాన పడిపోయారు. ‘ఏంటీ, దళితుడి లాంటి తక్కువ కులం వాడి మీద, కోపం ప్రకటించవలిసి వస్తే, దాని వల్ల పెద్ద కులం వాళ్లకి అరెస్టులా! ఎంత ఘోరం!’ – ఈ విషయం మీద గ్రామ పంచాయతీలో సమావేశం జరిగింది. ‘మాంగే కుటుంబాన్నంతా అంతమొందించాలి’ అని, పంచాయతీలో నిర్ణయమైపోయింది!’ అయితే, అది ఎలా, ఎప్పుడు, ఏ సాకుతో మొదలవ్వాలి? – అదే చర్చ! ‘ఓబీసీల పథకం ఏమిటో, ప్రియాంక, మంచి నీటి బావి దగ్గిరికి వెళ్లినప్పుడు, అక్కడ ఓబీసీ స్త్రీల మాటల ద్వారా, సైగల ద్వారా, గ్రహించింది. ఆ బావి దగ్గిర ఓబీసీ మహిళలు, ‘వాళ్లకి గుణపాఠం చెప్పబోతార్లే’ అనుకుంటున్నారు. అదంతా విన్న ప్రియాంక ఇంటికొచ్చి చెప్పగానే సురేఖ తన సెల్ఫోన్తో, (దాని నంబరు 9860496885) తన అక్క కొడుకైన రాష్ట్రపాల్ నార్వెనేకు చెప్పింది. అతడు వెంటనే, ‘మీరందరూ ఇల్లు వదిలేసి, వారధికి వెళ్లిపోండి’ అని చెప్పాడు. ‘ఇంత తొందరగా ఎలా వెళ్తాం? కొంచెం బట్టలైనా సర్దుకోవాలి కదా?’ అంది సురేఖ. ‘అయితే, వెంటనే మీరు విన్న దాన్ని గురించి పోలీసు రిపోర్టు ఇవ్వండి’ అన్నాడు అతను. ‘పోలీసులకు రిపోర్టులిస్తే ఏం జరుగుతుంది? గతంలో ఏం జరిగింది? వాళ్లు లంచాలకు తప్ప దేనికీ లొంగరు కదా?’ అంది సురేఖ. ప్రియాంక అప్పటికే పరుగున దుసాలకు వెళ్లి, సిద్దార్ధకీ, రాజేంద్రకీ, విషయం చెప్పి, గబగబా పరుగు నడకతో ఇంటికి వచ్చేసింది. ఆ మధ్యాన్నమే, సిద్దార్ధని కొట్టిన ఓబీసీ నేరస్తులకు అరెస్టులూ, విడుదలలూ జరిగాయి. వాళ్లని ఇళ్లకి తీసుకు రావడానికి ఓబీసీ కులాల వాళ్లు చాలామంది, రెండు ట్రక్కుల మీద కోర్టుకి వెళ్లి ఉన్నారు. విడుదలైన వాళ్లని ఎక్కించుకుని, పంచాయతీ మీటింగులో జరిగిన విషయాలన్నీ వాళ్లకి చెప్పారు, మాంగే కుటుంబాన్ని వెంటనే అంతం చెయ్యాలని! ఆ ట్రక్కుల్లో వాళ్లు, తప్ప తాగేసి ఉన్నారు. ఖైర్లాంజీ వాళ్లే గాక, పక్క గ్రామాల ఓబీసీలు కూడా కొందరు ఉన్నారు. వారిలో ఆడ వాళ్లు కూడా ఉత్సాహాలతో ఉన్నారు. ఆ ట్రక్కులు రెండూ, కోర్టు నించీ నేరస్తుల్ని తీసుకుని, మాంగే పాక ముందుకు పెద్ద పెద్ద కేకలతో వొచ్చేశాయి! ఆ ఇంట్లో మాంగే లేడు. అతను తన పొలంలో పనిలో ఉన్నాడు. ఇంట్లో ఉన్నది తల్లీ, కూతురూ, ఇద్దరు కొడుకులూ. సురేఖ వంట కోసం కూరగాయలు కోసుకునే పనిలో ఉంది. పిల్లలు ముగ్గురూ ఒక చోట కూర్చుని క్లాసు పుస్తకాలు తిరగేస్తున్నారు. పెద్దబ్బాయిది క్లాసు చదువు కాకపోయినా, ఏదో పుస్తకం చదవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇల్లు ప్రశాంతంగానే ఉన్నా, అందరి గుండెలూ దడదడలాడి పోతున్నాయి. ఏ ఆపద ముంచుకొచ్చినా, అది ఇప్పుడే జరగదనే నమ్మకం. అలా ఉన్న పాకలోకి, కొందరు ఓబీసీ ఆడవాళ్లు పరుగులతో దూరేశారు! ఒక మూల ఏదో పని చేసుకుంటున్న సురేఖ కనపడింది. ఆ ఆడ వాళ్లందరూ సురేఖ మీద పడ్డారు.
ఆ ఆడవాళ్లు తమ తల్లిని జుట్టు పట్టి, నేల మీద పడేసి ఈడ్చుకు రావడం పిల్లలు చూశారు. వాళ్లు కెవ్వున అరిచి, లేచేప్పటికి మొగవాళ్ల గుంపు వొచ్చి పిల్లల్ని పట్టేసింది! ఆ గుంపులు తాగేసి ఉన్నారు. పెద్ద పెద్ద అరుపులతో, తిట్లతో, పాకలో ఉన్న నలుగుర్నీ పాక బైటికి, నడి వీధిలోకి, లాగేశారు. అలా లాగేసిన తర్వాత, ఒక్క క్షణం కూడా ఆలస్యం లేకుండా, ఆడవాళ్ల శరీరాల మీద నించి బట్టలన్నీ లాగేశారు. ఆడా, మొగా, అందరూ, ఆ పని ఉత్సాహాలతో కేకలతో చేశారు. ఆ జనాల్లో, చాలామంది చేతుల్లో, కత్తులు, సైకిల్ చైన్లు, గొడ్డళ్లు, ఇనప రాడ్లూ, ఉన్నాయి. సురేఖని, వీధిలో బోసిగా పడేసి, ఓబీసీ ఆడవాళ్లు చుట్టూ నిలబడి నవ్వులతో, అరుపులతో చూస్తూ ఉండగా, ఒక్కొక్క మొగవాడూ సురేఖ శరీరం మీదకి ఎక్కడం, దిగడం! ఒక మొగవాణ్ణి తోసేసి ఇంకో మొగవాడు ఎక్కడం! అదో ఆట, దళిత స్త్రీతో! చుట్టూ ఆడ వాళ్లందరూ నవ్వులతో చూడడం! పాక ముందు రోడ్డు మీద అలా జరుగుతూ వుంటే, ప్రియాంకని ఒక పశువుల పాకలోకి లాక్కుపోయిన వాళ్లు, ఆ పిల్ల మీద అత్యాచారం మొదలుపెట్టారు. వీధిలో, తల్లి మీద జరుగుతున్నదే, పశువుల పాకలో ప్రియాంక మీద కూడా ప్రారంభమైంది. కొందరు మొగవాళ్లు, సురేఖ కొడుకుల్ని పట్టేసి, వాళ్లని తల్లి దగ్గిరికీ, సోదరి దగ్గిరికీ లాక్కుపోయి, ‘వాళ్ల మీద ఎక్కి మీ ప్రతాపం చూపించండి!’ అంటూ వాళ్లని, తల్లి దేహం మీదా, సోదరి దేహం మీదా పడేసి, వాళ్లని కొట్టడం సాగించారు. ఆ దళిత అనాధలకెవ్వరికీ స్పృహలు లేవు. వాళ్ళ ఊపిర్లు అప్పటికే ఆగిపోవడం మొదలైంది. సురేఖ తల మీద పెద్ద గొడ్డలితో బాదేవాడు బాదుతూ ఉంటే, ప్రియాంక దేహాన్నంతా ఉత్సాహంగా చీల్చేసే వాళ్లు చీల్చేస్తూ ఉంటే, కొందరు తాగుబోతులు, తాము చెప్పినట్టు దళిత మొగ పిల్లలు, తల్లి మీదా, సోదరి మీదా, ప్రవర్తించడం లేదని, ఆ మొగ పిల్లల్ని నేల మీద పడేసి, ‘మీరు మొగోళ్లు కాకపోతే, మీక్కూడా ఇవెందుకురా?’ అంటూ, ఆ పిల్లల పురుషాంగాల్ని రాళ్లతో, సుత్తులతో, బాది బాది, నజ్జునజ్జు చేసెయ్యడం, కోసెయ్యడం, వాళ్ల మొహాల మీద బాదెయ్యడం! ఓబీసీ ఆడ వాళ్లందరూ నవ్వులతో, కేకలతో, ఆ మొగాళ్లకి ఉత్సాహాలు కలిగిస్తూ అరవడం! అక్కడ జరుగుతున్న చర్యలన్నీ, తమకు అణిగి మణిగి ఉండని, తక్కువ కులం వాళ్ల మీద, తమ ఎక్కువ కుల ప్రభావం ప్రదర్శించడం!
‘తక్కువ కులం వాళ్లు, ఎక్కువ కులం వాళ్ల మీద ఫిర్యాదులు చేస్తారా? అరెస్టులు చేయిస్తారా? పెద్ద కులాల ప్రభావాలు తెలుసుకోండి’ అంటూ, సైకిల్ చైన్లతో, కత్తులతో, సుత్తులతో, కొడవళ్లతో, గొడ్డళ్లతో, బాదెయ్యడమే! అది, తమ ప్రతీకారాన్ని చూపడం! (తెలుగు అనువాదంలో, ఈ సంఘటనని వివరించిన కొన్ని వాక్యాలు ఇలా ఉన్నాయి: ”సురేఖ, ప్రియాంకలు, ఈ దాడి జరుగుతుందని, ఆ రోజు ఉదయం నించీ పసిగట్టి, తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. సురేఖ వంట పనిలో ఉండగా, పిల్లలు చదువుకుంటున్నారు. హిందూ కులాల మూక, ఒక్కసారిగా దాడి చేసి, ఇంట్లో నుంచి సురేఖను, పిల్లల్ని, బయటకి లాక్కొచ్చారు. మహిళలు కొంతమంది, సురేఖ – ప్రియాంకలను జుట్లు పట్టుకొని ఈడ్చుకొచ్చి వివస్త్రలను చేశారు. కొంతమంది యువకులు ప్రియాంకను దగ్గరలో వున్న పశువుల కొట్టంలోకి లాక్కెళ్లి, ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. కంటి చూపు సరిగా లేని సుధీర్ను, రోషన్ను, నిర్దాక్షిణ్యంగా హింసిస్తూ, చెల్లిపై, తల్లిపై, అత్యాచారం చెయ్యవల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అందుకు నిరాకరించినందుకు వాళ్ల మర్మాంగాలను నుజ్జునుజ్జు చేసి కోసేశారు. ఆ నలుగురు నిస్సహాయులను హిందూ కులాల మూక, వాళ్లకు తోచిన రీతిలో హింసించి చంపేసింది. శవాలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. రెండు గంటలపాటు ఈ హత్యాకాండ కొనసాగింది. తర్వాత ఎద్దు బండిని తీసుకొచ్చి, నలుగురి శవాలను, గ్రామాలకు నాలుగు కిలో మీటర్ల దూరంలో వున్న పెంచ్ కాలవలో విసిరేశారు.” అనువాదంలో పేజీ నంబరు 36.)
(ఇంకా ఉంది)
(Courtesy: NT)