-అంత్యక్రియలకు అడ్డగింత
భువనగిరి, కంటోన్మెంట్ : కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియల విషయంలో దయనీయ దృశ్యాలు కనిపిస్తు న్నాయి. కనీస గౌరవంగా సాగనంపాల్సిన చోట కొందరు అభ్యంతరం వ్యక్తంచేస్తుండటంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరవుతు న్నాయి. భువనగిరి హనుమాన్వాడలోని శ్మశాన వాటికలో కరోనా మృతులను దహనం చేయొ ద్దని ఎవరూ రాకుండా రాళ్లు, కంప వేశారు. ఇండ్ల సమీపంలో శ్మశానవాటిక వాటిక ఉండటంతో తాము అనారోగ్యానికి గురవుతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరం బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలోని అంబేద్కర్నగర్ బస్తీవాసులు ఇక్కడ మృతదేహాలను ఖననం చేయొద్దని శ్మశానవాటిక గోడను కూల్చేశారు. మృతదేహాలను తీసుకురాకుండా కర్రలతో అడ్డుకట్ట వేసి, తిరుమలగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వేరేచోట ఖననం చేసేలా చర్యలు తీసుకోక పోతే మళ్లీ ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరించారు.
Courtesy: NT