కమ్యూనిస్టు విప్లవకారుడు, కుల-వర్గ జమీలీ పోరాటాల సిద్దాంతకర్త, దళిత,బహుజన, సామాజిక, విప్లవనేత ప్రజల ప్రజాస్వామిక హక్కుల ఉద్య మనేత, ఉద్యమాల ఉపాధ్యా యుడు “ఉసా” నిన్న రాత్రి తన తుది శ్వాసనొదిలి, మనల వీడి పోయారని తెలియ పర్చడాని కి చింతిస్తున్నాము. ఆయన లేని లోటుపూడ్చ లేనిది, ఆయన దృఢంగా నమ్మిన, సిద్దాంత- ఆశయాలను చివరి కంటా కొనసాగిద్దాం! కొరోనా మహమ్మారి తాండవి స్తున్నందున ఆయన పోటోను ఎర్రని పూలతో అలంకరించి విప్లవ జోహార్లు అర్పిద్దాం!.
– భారత కమ్యూనిస్టు విప్లవ కారుల సమైక్యతా కేంద్రం (మా.లె) UCCRI-(M.L)కిషన్ వర్గం రాష్ట్ర కార్యదర్శి గడ్డం సదానందం.
బాధగా వుందన్నా..
దళిత బహుజన ఉద్యమనాయకుడు, మేధావి, కవి,రచయిత కళాకారుడు,సిద్ధాంత కర్త లాంటి అనేక లక్షణాలు కలిగిన అరుదైన వ్యక్తులలో ఉ.సా అన్న ఒకరు.1985 కారంచేడు నరమేధం సందర్భంగాజరిగిన ఉద్యమపరిచయం నుండి నేటి వరకు అనేక విషయాలు ఆయన్నుండి నేర్చుకున్నా. “కారంచేడు దళితులపై కమ్మభూస్వాములదాడి”అని ఆయన రాసిన కరపత్రంపై అపుడు ఆయన పనిచేస్తున్న పార్టీలో వచ్చిన విబేధాలకారణంగా పార్టీకి దూరమయ్యాడు. మారోజు వీరన్న”కుల-వర్గ సిద్దాత” డాక్యుమెంట్ తయారీలోఉసా అన్నపాత్ర కీలకం. మాకలయిక సందర్భంలో “కారంచేడు నన్ను పార్టీకి దూరం చేస్తే. నిన్ను ఉద్యమబాట పట్టించింది ప్రభాకర్” అని అనేక సార్లు గుర్తు చేసేవాడు. ఈదేశ పీడిత ప్రజల విముక్తికి కుల-వర్గ పోరాటాలవసరమని బలంగా నమ్మి చివరి క్షణాలవరకు ఆచరణలో వున్నవ్యక్తి. నాకుటుంబం హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ఒక కుటుంబ సభ్యులుగామా బంధం మరింత బలపడింది. రాజ్యహింస, అగ్రకులోన్మాద దాడులు జరిగిన ప్రతి సందర్భంలో చాలా సీరియస్ గా స్పందించేవాడు. వెంటనే బాధితులను పరామర్శించి వాళ్ళకు బరోసాగా నిలిచేవారు మిగిలిన వాళ్లను నిల బెట్టేవాడు. ఊ.సన్న అంటే ఒక బరోసా. 1992లో చీమకుర్తి (మావూరు)లోముగ్గురు దళితమహిళల అత్యాచార హత్యల సందర్భంగా జరిగిన ఉద్యమంలో నేను కన్వీనర్ గా ఉ.సా అన్న, కా.సత్యమూర్తి, కొండాలక్ష్మణ్ బాపూజీ కో-కన్వీనర్లుగా జరిగిన రాష్ట్రస్థాయి ఉద్యమం నుండి లక్షింపేట ఉద్యమం దాకా,అమరుడు తారకంసార్, ఉసా అన్న ల జీవితాచరణ ,ఉపన్యాసాలు, రాతలనుండి నేను చాలానే నేర్చుకున్నాను. గుంటూరు జిల్లా చుండూరు ప్రక్కనేవున్న బ్రాహ్మణకోడూరు లోని “ఊరులో అంటరానికులం”లో పట్టిన ఉసా అన్నవెలివాడ బతుకులబాగుకోసం ఉద్యమించాడు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు. రెండు రాష్ట్రాలలోని ప్రజలతో విస్తృత పరిచయాలువున్న ఉసా అన్ననిత్యం జనంమద్య, జనంతో ఉండే ఉసా అన్న మహాప్రస్థానం వేలాది మంది ఆప్తులతో జరగాల్సివుండె.కరోనా కాటుకుబలై ఒంటరిగా వెళ్లిపోతున్నాడు. కరోనా సృష్టిస్తున్న కల్లోలం కారణంగా ఇంకా ఎంతమంది ప్రజలతో,ప్రజలకోసంజీవించిన ఉద్యమకారులు ఈవిధంగా ఒంటరి ప్రయాణంచేయాల్సివస్తుందోకదా, ఇది అత్యంత విషాదకరం. నిత్యం హైదరాబాద్ లోని “అంకుష్”లో కలుసుకున్నపుడు జరిగిన చర్చలు గుర్తుకొస్తూ దుఃఖం ఆగడంలేదు. నీతో ఎప్పుడూ “మా ఒంగోలుగిత్త”అని పిలిపించుకునే నేను నీచివరిచూపుకు నోచుకోలేక పోతున్నందుకు ఇంకా బాధగావుందన్నా. మొదటితరం దళిత ఉద్యమ నాయకుల్లో ఒకరైన ఉసా అన్న లేకపోవడం దళిత బహుజన ఉద్యమాలకు తీరనిలోటు.
జోహార్ ఉసా అన్న
– ప్రభాకర్ దుడ్డు
చిరకాల మిత్రుడు, ఉద్యమాల ఉపాధ్యాయుడుగా అందరికీ చిరపరిచితుడు ఉ. సాంబశివరావు (ఉ.సా.) గారు కొవిడ్ తో రాత్రి మరణించారని తెలిసింది. 1970ల మధ్యలో అప్పటి యు సి సి ఆర్ ఐ (ఎం ఎల్) కార్యకర్తగా కొండమొదలు పోరాటంతో మొదలై, మార్క్సిస్ట్ లెనినిస్ట్ సెంటర్, ఎదురీత, దళిత బహుజన సమీకరణ కోసం అనేక ప్రయత్నాల నుంచి దేశీ దిశ దాకా ఐదు దశాబ్దాల పీడిత ప్రజా పక్షపాతం, అనేక ప్రజా ఉద్యమాలలో నిరంతర ఆచరణ, పాట, ఉపన్యాసం, రచనల వంటి విస్తృతమైన మేధో కృషి, మార్క్స్ ఆలోచనలనూ, ఫులే, అంబేద్కర్ ఆలోచనలనూ కలిపి భారత సమాజ విముక్తి సిద్ధాంతం తయారు చేయాలని తీవ్రంగా ప్రయత్నించిన మేధావి — తెలుగు సమాజంలో గణనీయమైన గౌరవ ప్రతిష్ఠ లను సంపాదించిన మంచి మనిషి. ఉ.సా. గారూ కన్నీటి జోహార్లు…
– ఎన్. వేణుగోపాల్
బహుజన,దళిత ఉద్యమ మేధావి, ఉపాధ్యాయుడు, సామాజిక విప్లవకారుడు ఊసా గారి ఊపిరాగి పోయింది. ఇన్నాళ్లూ సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి కరోనాకి బలయిపోయాడు. ఉద్యమాల సారథి మరణం తెలుగు సమాజానికి తీరని లోటు. పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా అయిన ఊసాగారికి జోహార్లు.
-పీఓడబ్ల్యూ
ఉ.సా. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. దళిత, బహుజన ఉద్యమ మేధావి. ఆ ఉద్యమాల ఉపాధ్యాయుడు. ఆ వర్గాల హక్కుల కోసం వినిపించిన బలమైన గొంతుక. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తొలినాళ్ల నుంచి బాసటగా నిలిచి, ఆంధ్ర-రాయలసీమ బహుజన వర్గాల మద్ధతు కూడగట్టినవాడు. ఆదిపత్యం ఏ రూపంలో ఉన్నా ధిక్కరించాల్సిందేనని నమ్మినవాడ. ఇన్నాళ్లూ సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి కరోనా మహమ్మారికి బలైపోయాడు. ఆయన మరణం బహుజన సమాజానికి తీరని లోటు. పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా ఉ.సా కి కన్నీటి జోహార్లు.
– పల్లె రవి కుమార్, అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్
ఆత్మగౌరవ ఉద్యమాల మహోపాధ్యాయుడు
ఉ.సా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరు. దళిత, బహుజన ఉద్యమ మేధావి. ఆ ఉద్యమాల ఉపాధ్యాయుడు. ఆ వర్గాల హక్కుల కోసం వినిపించిన బలమైన గొంతుక. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి తొలినాళ్ల నుంచి బాసటగా నిలిచి, ఆంధ్ర-రాయలసీమ బహుజన వర్గాల మద్ధతు కూడగట్టినవాడు. ఇన్నాళ్లూ సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి
ప్రతి ప్రజా ఉద్యమంలో తన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి.
కరోనా మహమ్మారికి బలైపోయాడు. ఆయన మరణం పేద, బహుజన సమాజానికి తీరని లోటు. పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా ఉసా కి కన్నీటి జోహార్లు.
– కాసాని శ్రీనివాసరావు
అధ్యక్షుడు, జై స్వరాజ్ పార్టీ