కోల్సిటీ, ఆగస్టు 28: ద్విపాత్రాభినయం సినిమాల్లో హీరోలు ఒకరి పేరుతో మరొకరు వెళ్లి చేసే పనులు అలరిస్తుంటాయి. ఇద్దరూ అచ్చం ఒకేలా ఉండడంతో ఎవ్వరూ వారిని గుర్తు పట్టరు. అయితే, అచ్చం ఇటువంటి ఘటనే నిజజీవితంలో జరిగితే? మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది.
ఒకేలా రూపురేఖలున్న కవలలు కావడంతో ఒకరి పేర వచ్చిన ఉద్యోగాన్ని మరొకరు చేస్తున్నారు. ఇలా 12 ఏళ్లుగా టీఎ్సఎన్పీడీసీఎల్లో అన్న ఉద్యోగాన్ని తమ్ముడు చేస్తున్నాడు. తాజాగా విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ విషయం వెలుగు చూసింది. గోదావరిఖని చంద్రశేఖర్నగర్కు చెందిన గాదె రాందాస్, గాదె రవీందర్ అన్నదమ్ములు. పన్నెండు సంవత్సరాల క్రితం గాదె రాందా్సకు టీఎ్సఎన్పీడీసీఎల్లో జూనియర్ లైన్మన్గా ఉద్యోగం వచ్చింది. అతని పేరుతో తమ్ముడు గాదె రవీందర్ ఉద్యోగంలో చేరాడు. జూనియర్ లైన్మన్ నుంచి అసిస్టెంట్ లైన్మన్, తరువాత లైన్మన్గా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం గోదావరిఖని ఈస్ట్సెక్షన్ లైన్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ విషయంలో వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టగా, అన్న రాందాస్ పేరుతో తమ్ముడు గాదె రవీందర్ ఉద్యోగం చేస్తున్నట్టు తేలింది. దీంతో రవీందర్ను ఉద్యోగం నుంచి తొలగించారు. టీఎ్సఎన్పీడీసీఎల్ మంథని డివిజనల్ ఇంజనీర్ పెందోట తిరుపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాదె రవీందర్పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు వన్టౌన్ పోలీసులు తెలిపారు.
Courtesy Andhrajyothi