- ముంబైలోని సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చికిత్స
- ఆస్పత్రికి తరలించినట్లు తెలియదు
- 13న అడిగితే ఆరోగ్యం బాగానే ఉందన్నారు
- వరవరరావు కుమార్తె పవన వెల్లడి
- కరోనా వస్తుందన్నా పట్టించుకోలేదు: సంధ్య
హైదరాబాద్/సిటీ : బీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీగా ఉన్న ప్రముఖ కవి, విరసం నాయకుడు వరవరరావుకు కరోనా సోకింది. ముంబైలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు కరోనా వైరస్ సోకడంతో గురువారం సెయింట్ జార్జ్ ఆస్పత్రిలో చేర్పించా రు. ముంబైలోని తలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరో గ్యం విషమించడంతో ఈ నెల 13న జేజే ఆస్పత్రిలోని న్యూ రాలజీ విభాగంలో చేర్చించారు. మరుసటి రోజు కరోనా పరీ క్ష కోసం నమూనాలు సేకరించారు. బుధవారం ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ‘‘వరవరరావు ఆస్పత్రిలో చేరినప్పుడు కరోనా లక్షణాలు లేవు. ముందు జాగ్రత్తగా న మూనాలు సేకరించి ల్యాబ్కు పంపాం. ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మాది కరోనా ఆ స్పత్రి కాకపోవడంతో ఆయనను సెయింట్ జార్జ్ ఆస్పత్రికి తరలించాం’’ అని జేజే ఆస్ప త్రి డీన్ డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. కరోనా సోకిన విషయాన్ని జైలు అధికారులు ఆయన కుటుంబసభ్యులకు తెలియజేశారు. వారు ముంబైకి బయలుదేరినట్లు తెలిసింది. కాగా, వరవరరావును జైలు నుంచి ఆస్పత్రికి తరలించినట్లు తమ కు సమాచారం ఇవ్వలేదని ఆయన కుమార్తె పవన అన్నారు. జూలై 13న జైలు అధికారులను సంప్రదించగా వరవరరావు ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారని పేర్కొన్నారు. జూలై 11న వరవరరావు హేమలతతో ఫోన్ మాట్లాడరని.. ఆ సమయం లో తోటి ఖైదీ ఒకరు వరవరరావు సరిగా నడవలేకపోతున్నారని, టాయిలెట్కు కూడా వెళ్లలేకపోతున్నారని చెప్పారని వివరించారు. వరవరరావుకు కరోనా సోకిన కారణంగా వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని పీవోడబ్ల్యూ కన్వీనర్ వి.సంధ్య డిమాండ్ చేశారు. కరోనా సోకే అవకాశం ఉందని రెండు నెలలుగా విజ్ఞప్తులు చేసినా పా లకులు, న్యాయ వ్యవస్థ పట్టించుకోలేదని తెలిపారు. వరవరరావు ప్రాణాలను రక్షించాలని కోరారు. అలాగే ప్రొఫెసర్ సాయిబాబా, మేధావులను, ప్రజాస్వామిక వాదులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆరోగ్యం బాధ్యత కేంద్రానిదే: నారాయణ
వరవరరావుకు ఆరోగ్యం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మెరుగైన వైద్యం అందేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆరోగ్యంపై ఆందోళన..
కొంతకాలంగా వరవరరావు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా అవన్నీ విఫలమయ్యాయి. ఆయన్ను విడుదల చేయరాదని ఎన్ఐఏ గట్టిపట్టుదలతో ఉంది. పౌరసమాజం నుంచి ఒత్తిళ్లు రావడం, ఆయన ప్రాణానికి ముప్ప ఉందని, వెంటనే చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు.
Courtesy Andhrajyothi