SFI రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి
వరంగల్ పట్టణ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోనీ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పత్రాలను యుఎస్ఎఫ్ఐ సభ్యులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూలై 23న తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ల వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిత్యావసరాల పైన మరియు రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు. అలాగే రైతులు తీసుకునే విత్తనాలు, క్రిమిసంహారక మందులు ఇతర వస్తువుల పై జిఎస్టి వేయడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని వాపోయారు. అలాగే కేంద్ర ప్రభుత్వం బీమా పథకం తీసుకు వచ్చింది కానీ దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని తెలిపారు.
కరోనా సంక్షోభం సమయంలో ప్రజలు, రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా స్పందించి ప్రజలను కూలీలను రైతులను నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం హామీలు గొప్ప తప్ప ఆచరణలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అలాగే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో న్యాయవాది సంపత్, రాజు పవన్, శ్రీకాంత్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.