న్యూఢిల్లీ: బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోనే కాకుండా అమెరికాలోని యూనివర్సిటీల్లో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలైన హార్వర్డ్, యేల్, స్టాన్ ఫÛర్డ్, కొలంబియా వర్సిటీలతో సహా 19 యూనివర్సిటీల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు పౌరస్వత సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనప్రదర్శనలు చేశారు. ఢిల్లీలోని జామియామిలియాఇస్లామియా(జేఎంఐయూ), అలీఘడ్ యూనివర్సిటీ(ఏఎంయూ)ల్లోకి పోలీసులు చొరబడి విద్యార్థులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. బుధవారం యూకేలోని ఆక్స్ఫర్డ్యూనివర్సిటీలో భారీఎత్తున విద్యా ర్థులు నిరసనప్రదర్శనలు నిర్వహించారు. ఈ పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని విమర్శిం చారు. భారత్లో మానవహక్కుల ఉల్లంఘనకు జరుగుతున్నదనీ, నిరసనకారు లకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు. ఈమేరకు ఆన్లైన్లో బహిరంగ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనపై ప్రముఖ కెర్నెల్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, బర్కిలీ యూనివర్సిటీ, ఇల్లినాయిస్ యూనివర్సిటీల విద్యార్థులు సంతకాలు చేశారు. యూనివర్సిటీల్లో మోహరించిన భద్రత బలగాలను ఉపసంహరిం చుకోవాలనీ, చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Courtesy Nava telangana