నా కేకల్ని మనసులో పెట్టుకోవద్దు!
కోర్టుకు తప్పుడు లెక్కలు చెప్పిన ఐఏఎ్సలపై, నాకున్న అన్ని అధికారాలూ వినియోగించి, చర్యలు తీసుకోవచ్చు. కానీ, నేనలా చేయడం లేదు. మీరైనా, మేమైనా ప్రజల కోసం పని చేయాలి. ఐఏఎస్ అధికారులను కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు. మీపై వేసిన కేకలను మనస్సులో పెట్టుకోకండి. చట్టాల్ని మనం అమలు చేయాలి. ప్రజల కష్టాలకు పరిష్కారం చూపేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి.
ప్రభుత్వాన్ని గౌరవిస్తా
ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఎన్నో పథకాల్లో పొరుగు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను. 48 వేల మంది కోసం కాదు.. 6 కోట్ల మంది కోసం పునరాలోచన చేయండి. రూ.49 కోట్లు ప్రభుత్వానికి పెద్ద మొత్తం కాదు.
పెద్ద మనసు చూపించాలి
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇంత మంకుపట్టు పడుతుందని మేం భావించలేదు. ప్రభుత్వం ఒకవైపు, సంఘాలు మరోవైపు మొండి పట్టు పడుతున్నాయి. దేనికైనా పట్టువిడుపులు ఉండాలి. మీ మధ్యలో కోట్లాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారనే విషయం గమనించాలి. పెద్ద మనసు (బడాపన్) ఉండాలి. ముందుగా పెద్దలే తగ్గాలి.
నా కేకల్ని మనసులో పెట్టుకోవద్దు!
కోర్టుకు తప్పుడు లెక్కలు చెప్పిన ఐఏఎ్సలపై, నాకున్న అన్ని అధికారాలూ వినియోగించి, చర్యలు తీసుకోవచ్చు. కానీ, నేనలా చేయడం లేదు. మీరైనా, మేమైనా ప్రజల కోసం పని చేయాలి. ఐఏఎస్ అధికారులను కించపరచాలన్నది నా ఉద్దేశం కాదు. మీపై వేసిన కేకలను మనస్సులో పెట్టుకోకండి. చట్టాల్ని మనం అమలు చేయాలి. ప్రజల కష్టాలకు పరిష్కారం చూపేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి.
- ఇప్పుడున్నది ఒక్కటే ఆర్టీసీ.. బస్సులన్నీ ఏపీఎ్సఆర్టీసీవే
- విభజన.. చట్ట ప్రకారం జరగాలి.. చర్యలు తీసుకోలేదేం?
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం సూటి ప్రశ్న
- ఆర్టీసీ విభజనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి
- అటువంటి అనుమతులు పొందలేదు: ఏఎస్జీ వెల్లడి
- హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్: ఏపీఎ్సఆర్టీసీ విభజన, పునర్నిర్మాణం ఇంకా జరగలేదని, అందువల్ల, టీఎ్సఆర్టీసీకి చట్టబద్ధత లేనట్లేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక చట్టం ద్వారా ఏపీఎ్సఆర్టీసీ ఏర్పాటైందని, దాని ప్రకారమే ఇప్పుడు విభజన కూడా జరగాలని తేల్చి చెప్పింది. సమ్మె విరమించాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీకి, గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థి ఆర్.సుబేందర్సింగ్, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అవి గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావు హైకోర్టుకు కేంద్రం వాదనను నివేదించారు. టీఎ్సఆర్టీసీకి చట్టబద్ధత లేదని తెలిపారు. మోటారు వాహనాల చట్టం 1950లోని సెక్షన్ 47 (ఏ) ప్రకారం ఆర్టీసీని పునర్నిర్మాణం చేయాలన్నా, విభజన చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని స్పష్టం చేశారు.
ఇంతవరకూ అలాంటి అనుమతులు పొందలేదని తేల్చి చెప్పారు. ‘‘ఏపీఎ్సఆర్టీసీ నుంచి టీఎ్సఆర్టీసీ వేరుపడలేదు. ప్రస్తుతం నడుస్తున్న టీఎ్సఆర్టీసీ తాత్కాలికమైనది. అలాగే, కేంద్రం వాటా 33 శాతం దానంతట అదే టీఎ్సఆర్టీసీకి రాదు. చట్టబద్ధంగా వేరుపడిన తర్వాతే వస్తుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి’’ అని వివరించారు. దాంతో, చట్ట ప్రకారం టీఎ్సఆర్టీసీ వేరుపడలేదని, ఆస్తులు, అప్పుల పంపకాలు జరగలేదని, ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు మరుగుపర్చారని ధర్మాసనం ప్రశ్నించింది. దాంతో, ఆర్టీసీ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎ్సఆర్టీసీని ఏర్పాటు చేశామని ఏజీ బీఎస్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. ఏపీఎ్సఆర్టీసీ పునర్ విభజన అంశం పెండింగ్లోనే ఉందన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోను కోర్టు పరిశీలనకు ఇచ్చారు.
.దానిని పరిశీలించిన ధర్మాసనం.. ‘‘చట్టంలోని సెక్షన్ 47 (ఏ) ప్రకారం ఆర్టీసీ పునర్నిర్మాణం జరగాలి. ఇంకా విభజన కాలేదు. ఈ లెక్కన టీఎ్సఆర్టీసీకి చట్టబద్ధత లేనట్లే. కొత్తగా ఏర్పాటు చేశామని అంటే.. కొత్త కార్పొరేషన్కు నిధులు మంజూరు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న బస్సులన్నీ ఏపీఎ్సఆర్టీసీకి చెందినవే అవుతాయి’’ అని వ్యాఖ్యానించింది. రాష్ట్రం విడిపోయి ఆరు సంవత్సరాలు కావస్తోందని, ఆర్టీసీ విభజనకు సంబంధించి కేంద్రానికి ఏదేని లేఖ రాశారా..? అని ఆరా తీసింది. ‘‘పునర్విభజన చట్టంలోని షెడ్యుల్-9లో ఉన్న సంస్థలు వేరు. ఆర్టీసీ వేరు. ప్రత్యేక చట్టం ద్వారా ఆర్టీసీ ఏర్పాటైంది. దాని విభజన కూడా ఆ చట్ట ప్రకారమే జరగాలి’’ అని అభిప్రాయపడింది. ఏపీ పునర్విభజన చట్టంలోని పలు సెక్షన్లను ఉటంకించిన ధర్మాసనం.. అందులో రెండు రాష్ర్టాల మధ్య 58:42 నిష్పత్తిలో పంచుకోవాలన్న సూత్రాన్ని ప్రస్తావించింది. ఇంతకాలం అవుతున్నా కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. ఏపీఎ్సఆర్టీసీని విభజించి రెండుగా చేయాలని, అంతవరకూ చట్టం దృష్టిలో ఆర్టీసీ ఒక్కటేనని తేల్చి చెప్పింది. ‘‘సెక్షన్ 3 కింద కొత్తగా టీఎ్సఆర్టీసీని ఏర్పాటు చేస్తే విభజన అంశం తెరపైకే రాదు. ఇక్కడ కూడా పరస్పర విరుద్ధంగా చెబుతున్నారు. జూన్ 2, 2014న రాష్ట్రం వేరు పడింది.
అప్పటి నుంచీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆర్టీసీ విభజనకు సంయుక్తంగా ఎందుకు ప్రయత్నించలేదు? ఆర్టీసీకి ప్రత్యేక చట్టం ఉంది. చట్టం తెలియదంటే ఎలాంటి మినహాయింపు ఉండదు. మీరు చెప్పిన ప్రకారం చూసుకున్నా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2016 ఏప్రిల్ 22న టీఎ్సఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు జీవో ఇచ్చారు. అంతకు ముందు రెండేళ్లు ఏవిధంగా నిర్వహించారు?’’ అని ప్రశ్నించింది. దాంతో, ఈ అంశంపై ప్రభుత్వ వివరణ తీసుకుని చెబుతామని ఏజీ తెలిపారు. ఆర్టీసీ ఆస్తుల విభజన జరిగే వరకు ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకే సెక్షన్ 3 ప్రకారం టీఎ్సఆర్టీసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Couretsy Andhrajyothy..