- కుమారుల ఉద్యోగాలు పోతాయేమోనన్న ఆందోళన
కొణిజర్ల: ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న తన కుమారుల ఉద్యోగాలు పోతాయేమోనని కొన్నాళ్లుగా ఆందోళన చెందుతున్న ఓ మహిళ గుండెపోటుతో మృతిచెందింది. మృతురాలు.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అనంతారం గ్రామానికి చెందిన దామెర్ల అగ్నిష్(63). ఆమె నలుగురు కుమారుల్లో రాఘవులు, వీరభద్రం ఆర్టీసీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఖమ్మం డిపోలో రాఘవులు, మధిర డిపోలో వీరభద్రం పనిచేస్తున్నారు. వారి ఉద్యోగాలు ఏమైపోతాయోనని కొన్నాళ్లుగా అగ్నిష్ మనోవేదనకు గురైందని కుటుంబసభ్యులు చెప్పారు. సోమవారం టీవీ చూస్తూనే కుప్పకూలిందని రాఘవులు, వీరభద్రం కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలిసి మల్లు భట్టివిక్రమార్క గ్రామానికి చేరుకుని.. ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు.
courtesy Andhra Jyothy