యాంటీబాడీలను ప్రేరేపిస్తోంది
లాన్సెట్ జర్నల్లో కథనం
మాస్కో, సెప్టెంబరు 4: ‘స్పుత్నిక్-వి’..! ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు తాము కనుగొన్న టీకా ఇది అని గత నెలలో రష్యా ఘనంగా ప్రకటించుకుంది. స్వయంగా ఆ దేశాధ్యక్షుడు పుతిన్ కుమార్తెకే తొలి టీకా ఇచ్చినా అనేక అనుమానాలు. కారణం.. తొలి రెండు అంచెల క్లినికల్ ట్రయల్స్ సమాచారం బయటి ప్రపంచానికి చెప్పకపోవడం, ట్రయల్స్కు ఎంచుకున్నవారి సంఖ్య తక్కువగా ఉండటమే.
అయి తే.. వీటికి చెక్ పెడుతూ, ‘స్పుత్నిక్-వి’ ఫలితాలపై తాజాగా ఆశావహ వార్త. తొలి రెండు దశల మానవ ప్రయోగాల్లో పాల్గొన్నవారందరిలో.. ‘స్పుత్నిక్-వి’తో శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తయినట్లు ప్రఖ్యాత వైద్య జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. జూన్, జూలైల్లో 76 మందికి టీకా ఇవ్వగా.. అందరిలోనూ నూరు శాతం యాంటీ బాడీలు ఉత్పత్తయినట్లు లాన్సెట్ పేర్కొంది. ఎవరిలోనూ ఇతర దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) లేవని పేర్కొంది.
కాగా.. లాన్సెట్ కథనాన్ని ప్రస్తావిస్తూ.. తమ టీకాపై వచ్చిన సందేహాలకు బదులిచ్చే సమ యం వచ్చిందని రష్యన్ డైరెక్ట్ ఇన్వె్స్టమెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సీఈవో కిరిల్ దిమిత్రియెవ్ అన్నారు. మిగ తా దేశాల వ్యాక్సిన్ల పని తీరును ప్రశ్నిస్తామని చెప్పారు. మరోవైపు స్పుత్నిక్-వి ఉత్పత్తిలో పాలుపంచుకుంటామని చాలా దేశాలు కోరుతున్నా.. తాము భారత్తో భాగస్వా మ్యం కోసం ఎదురుచూస్తున్నామని కిరిల్ దిమిత్రియెమ్ గతంలోనే ప్రకటించారు.
కరోనా కట్టడికి తీసుకున్న చర్యలతో పాటు స్పుత్నిక్-విపై సానుకూల కథనాల నేపథ్యం లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం రష్యా ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, ప్రజలకు అభినందనలు తెలిపారు. కాగా, కరోనా టీకాపై ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ఫైజర్ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే నెల చివరి నాటికి తాము అభివృద్ధి చేస్తున్న టీకా సామర్థ్యం తెలిసిపోతుందని పేర్కొం ది. కరోనాను అడ్డుకుంటుందని తేలితే.. అత్యవసర వినియోగం కోసం అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ)కు దరఖాస్తు చేస్తామని స్పష్టం చేసింది.
Courtesy Andhrajyothi