రూ.300 కోట్ల బినామీ ఆస్తులు జప్తు
చెన్నై : అక్రమార్జన కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఆదాయపన్ను శాఖ షాక్ ఇచ్చింది. మూడేళ్ల క్రితం ఆ శాఖ శశికళ అక్రమ సంపాదనలను కనుగొనే దిశగా 180 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. అప్పట్లో శశికళకు చెందిన రూ.1600 కోట్ల బినామీ ఆస్తులను జప్తు చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై పోయెస్ గార్డెన్లో జయలలిత నివాసగృహానికి ఎదురుగా స్థలాన్ని కొనుగోలు చేసి, జయ నివాసానికి దీటుగా శశికళ భవన నిర్మాణం చేపట్టారు. రూ.300 కోట్ల విలువచేసే ఆ స్థలం కూడా శశికళ బినామీ ఆస్తిగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ ఆ ఆస్తిని జప్తు చేస్తున్నట్లు రెండు రోజుల కిందట ప్రకటించింది.
Courtesy Andhrajyothi