తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవ మైనారిటీలపై, ఆ సంస్థల పై నానాటికి దాడులు పెరిగిపోతున్నాయి.2017 సంవత్సరము నుంచి ఇప్పటివరకు 37 సంఘటనలు జరిగినట్లు తెలిసిన వివరాలను బట్టి అర్థం అవుతున్నది. ముఖ్యంగా హిందుత్వ, సంఘ పరివార్ శక్తులు వీటి వెనక ఉన్నాయి. ప్రభుత్వం క్రైస్తవుల పైన వారి సంస్థల పైన హింసాత్మక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార వ్యవస్థ మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాడుల వివరాలు కింద ఇస్తున్నాం. ఇంకా అనేక సంఘటనలు ఉండి ఉండవచ్చు.