గురుగ్రామ్ – పటౌడీలోని ఒక చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలు చేసుకుంటున్న వారిన రైట్ వింగ్ అతివాదులు భంగం కలిగించారు. అతివాద కార్యకర్తలమని చెప్పుకునే ఈ బృందం చర్చి ఆవరణలోకి చొరబడి కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం కొందరు వ్యక్తులు చర్చి ప్రాంగణంలోకి ప్రవేశించి ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేయడం వీడియోలో ఉంది. వారు పాటలు పాడె బృందాన్ని వేదికపైనుంచి కిందకి దింపి మైక్ను కూడా లాక్కోవడం కనిపించింది. గురుగ్రామ్లోని కొన్ని బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం వివాదానికి దారితీసిన సమయంలో ఈ సంఘటన జరిగింది.
TOI ప్రకారం, ఒక స్థానిక పాస్టర్ ఇలా అన్నారు, “మేము చర్చిలో మహిళలు మరియు పిల్లలతో ప్రార్ధనలు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడం భయానకంగా ఉంది. రోజురోజుకు ఈ ఉపద్రవం పెరుగుతోంది. ఇది ప్రార్థన మరియు మతంపై మా హక్కును ఉల్లంఘించడమే.” అని అన్నారు. ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పటౌడీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అమిత్ కుమార్ తెలిపారు.
#Gurugram #Church #ChristamsCelebrations