- మూడో రోజు విచారణ తర్వాత ఎన్సీబీ ప్రకటన
- చిత్రపరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్
- బాలీవుడ్లో పాతిక మందికి లింకులు?
- చిత్రపరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్
- త్వరలో వారిని కూడా విచారించే అవకాశం
- కంగనా రనౌత్ చుట్టూ మత్తుపదార్థాల ఉచ్చు
- బెంగళూరులో నటి సంజనా గల్రానీ జైలుకు
ముంబై/బెంగళూరు : సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కాస్తా.. ఇప్పు డు బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం చుట్టూ తిరుగుతోంది. డ్రగ్స్ కోణంలో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్సీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఆమెకు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. బాలీవుడ్లో 25మందికి డ్రగ్స్తో సంబంధం ఉందని ఎన్సీబీ విచారణలో రియా వెల్లడించినట్లు తెలిసింది. దీంతో ఆమెను కస్టడీకి తీసుకునేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. బాలీవుడ్కు చెందిన మరికొందరిని కూడా విచారించే అవకాశాలున్నాయి. కాగా సుశాంత్ మృతి కేసులో రియాను సీబీఐ, ఈడీ అధికారులు ప్రశ్నించిన విష యం తెలిసిందే. ఆ సమయంలో ఈడీ అధికారులు రియా సెల్ఫోన్ను విశ్లేషించగా ఆమె వాట్సాప్ చాటింగ్లలో డ్రగ్స్ కోణం బయటపడింది. దీంతో మాదక పదార్థాల నిరోధక సంస్థ(ఎన్సీబీ) రంగంలోకి దిగింది. గతవారం రియా సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరిండాను అరెస్టు చేసింది. షోవిక్ వాంగ్మూలం మేరకు ఆదివారం నుంచి 3 రోజులపాటు రియాను విచారించింది. తాను సుశాంత్ కోసమే డ్రగ్స్ తీసుకొచ్చానని, వాటిని వాడలేదని ఆమె అధికారులకు చెప్పినట్లు తెలిసింది. సుశాంత్ గంజాయి వాడేవాడని తెలిపింది.
ఉచ్చులో కంగనా?
మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చుట్టూ కూడా డ్రగ్స్ ఉచ్చు బిగుస్తోంది. ఆమె బిల్డింగ్లో అనధికారిక నిర్మాణాలున్నాయంటూ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మంగళవారం నోటీసులు అంటించారు. ఈ విషయాన్ని కంగనా ట్విటర్ ద్వారా తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీలోనూ కంగనాకు డ్రగ్స్తో లింకుపై ప్రస్తావ న వచ్చింది. నటుడు, టీవీ వ్యాఖ్యాత శేఖర్ సుమన్ కుమారు డు, కంగన మాజీ ప్రియుడు అధ్యయన్ సుమన్ ఓ ఇంటర్వ్యూలో ఆమె డ్రగ్స్ తీసుకునేదని చెప్పడంపై శివసేన ఎమ్మెల్యేలు ప్రతాప్ సర్నాయక్, సునీల్ ప్రభు శాసనసభలో ఓ ప్రశ్నను లేవనెత్తారు. ‘‘ముంబై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతారు’’ అని హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అన్నారు. అయితే.. హోంమంత్రి వ్యాఖ్యపై కంగనా సీరియ్సగా స్పందించారు. ‘‘మీరు(అనిల్ దేశ్ముఖ్), ముంబై పోలీసులు నాకు నార్కోటిక్స్ పరీక్షలు నిర్వహించవచ్చు. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ముంబైని వీడి వెళ్లిపోతాను’’ అని ట్వీట్ చేశారు.
శాండల్వుడ్ నటి సంజన అరెస్ట్
కన్నడ చిత్ర పరిశ్రమ శాండల్వుడ్లోనూ డ్రగ్స్ కలకలం కొనసాగుతోంది. డ్రగ్స్ కేసు దర్యాప్తును కేం ద్ర నేర నియంత్రణ విభాగం(సీసీబీ) ముమ్మరం చేసింది. ఇప్పటికే సినీ నటి రాగిణి ద్వివేదితో పాటు మరికొందరిని సీసీబీ అధికారులు అరెస్టు చేసిన విష యం తెలిసిందే. తాజాగా నటి సంజనా గల్రానీని అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం 6.30 గంట లకు బెంగళూరులోని ఇందిరానగర్లో ఉన్న సంజన నివాసానికి వెళ్లిన పోలీసు లు నాలుగున్నర గంటల పాటు సోదా లు చేశారు. ఆమె ఇంట్లోని పూల కుండీ లు, వంటగది, ఆమె గది, బాల్కనీ, కార్లలోనూ తనిఖీలు చేపట్టారు. అనంతరం ఆమెను అరె స్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కోర్టులో హాజరు పరి చి, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. మరికొన్ని వివరాలను రాబట్టేందుకు పోలీసులు కస్టడీ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఢిల్లీకి చెందిన వీరెన్ ఖన్నా అనే వ్యాపారవేత్త ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరేన్ బెంగళూరులో బడా పార్టీలు నిర్వహిస్తుంటాడు. ఈ వ్యవహారంలో సంజనా సన్నిహితుడైన రాహుల్ థోన్సే కూడా కొద్దిరోజుల క్రితమే అరెస్టయ్యాడు. సంజన ఇంట్లో ల్యాప్టాప్, హర్డ్ డిస్క్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
Courtesy Andhrajyothi