దర్యాప్తులో ఎన్సీబీకి వెల్లడించిన రియా చక్రవర్తి
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ కేసులో మరో సంచలనం! ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి.. మాదకద్రవ్యాలు తీసుకునే పలువురు బాలీవుడ్ ఏ-లిస్టర్ల పేర్లను ఎన్సీబీకి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) వెల్లడించింది. వారిలో.. తెలుగులో పలు సూపర్హిట్ చిత్రాల్లో నటించిన కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్, హీరో రణ్వీర్ సింగ్ సన్నిహితురాలు సైమోన్ ఖంబట్టా తదితరుల పేర్లు ఉన్నట్లు టైమ్స్ నౌ ఒక సంచలన వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.