ఐదేళ్లలో 3.7 లక్షల కోట్లు రూపాయల ఆదాయం
* ఖర్చు ఆరులక్షల కోట్లకు పైగానే
* 2029 నాటికి 13 లక్షల కోట్లకు చేరనున్న రెవిన్యూ లోటు
రాష్ట్ర ఖర్చు ఆదాయాన్ని మించిపోతోంది. 2015-16 నుండి ఇప్పటివరకు ఏ సంవత్సరపు లెక్కలు చేసినా ఆదాయం కన్నా ఖర్చు రెట్టింపుగా కనిపిస్తోంది. రెవన్యూలోటు కూడా భారీగా పెరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే పదేళ్లనాటికి ద్రవ్యలోటు 13 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అధికారుల అంచనా! ఈ మేరకు పూర్తి వివరాలు పేర్కొంటూ అధికారులు రూపొం దించిన నివేదిక చర్చనీయాంశంగా మారింది. అధికారులు రూపొందించిన లెక్కల ప్రకారం గత ఐదేళ్లకాలంగా 3.7 లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. అదే సమయంలో ఖర్చు మాత్రం ఆరులక్షల కోట్ల రూపాయలకు చేరింది.
అంటే, ఆదాయం కన్నా ఖర్చు 2.3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ. కొన్నేళ్లుగా రాష్ట్ర ఆదాయం తగ్గడంతో పాటు, కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లు, ఇతర నిధుల్లో కూడా కోత పడుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. టిడిపి, వైసిపిలు పోటీపడి చేపట్టిన కొత్త పథకాలు కూడా ఈ పరిస్థితికి కారణంగా చెబుతున్నారు. అంటే దాదాపు 37 వేల కోట్ల రూపా యలు అదనంగా ఖర్చు చేసినట్టైంది. ఆ తరువాత కూడా ఇది మరింతగా పెరుగుతూ ఈ ఏడాది అంచనాల్లో 70 వేల కోట్ల రూపాయలకు చేరింది.
ఈ లెక్కలను ఆర్ధికశాఖ తయారు చేసినట్లు
ఆదాయ వ్యయాలపై ముందస్తు అంచనాలు సిద్ధం చేసిన అధికారులు రానున్న సంవత్సరాల్లోనూ భారీగా రెవిన్యూలోటు ఉంటుం దని చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో ఆదాయం కన్నా ఖర్చు భారీగా ఉరడడం వల్ల రెవిన్యూ లోటు ఐదు లక్షల కోట్లకు చేరుకురటురదని అరచనా వేస్తు న్నారు. అదే 2029-2030 నాటికి ఆదాయ లోటు 13 లక్షల కోట్ల్ల రూపాయలకు చేరుకురటురదని అరచనాకు వస్తున్నారు.
Courtesy Prajasakthi..