న్యూఢిల్లీ: ‘బనారస్ హిందూ విశ్వవిద్యాలయం’ (బీహెచ్యూ)లోని సంస్కృత విద్యా ధరం విజ్ఞాన్ (ఎస్వీడీవీ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులైన ఫిరోజ్ఖాన్.. విద్యార్థుల నిరసనలతో మరో విభాగంలో చేరడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు అదే వర్సిటీలోని ఆర్ట్స్ విభాగంలో టీచింగ్ పోస్ట్, ఆయుర్వేదం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఏ పోస్టుకు ఎంపికైనా ఎస్వీడీసీ ఫ్యాకల్టీ నుంచి ఫిరోజ్ తప్పుకుంటారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఫిరోజ్ ఆర్ట్స్ ఫ్యాకల్టీలో బోధించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎస్వీడీవీ విద్యార్థులూ చెబుతుండటంతో, అందులోనే బోధించడానికి ఖాన్ ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించాయి. కాగా, సంస్కృతంలో పీహెచ్డీ హౌల్డర్ అయిన ఫిరోజ్.. ఈ నెల 7న ఎస్వీడీవీ విభాగంలో చేరారు. అయితే విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇప్పటి వరకు ఒక్క తరగతి కూడా చెప్పలేదు. ముస్లిం ప్రొఫెసర్ అయిన ఫిరోజ్.. సనాతన ధర్మం, కర్మల గురించి చెప్పడానికి తమ ఆచారాలతో ఆయన మమేకం కాలేరనీ విద్యార్థులు ఆరోపిస్తూ.. తరగతులు బహిష్కరించి, నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
Courtesy Navatelangana…