డాక్టర్ వేణుగోపాలరెడ్డి
చాలా కాలం తరువాత నిన్న రాత్రి నాకు సరిగా నిద్రపట్టలేదు. దానికి కారణం పడుకునేముందు చదివిన రెండు శుభవార్తలు మిత్రులకు ఎప్పుడు చేరవేద్దామనే ఆతృత కావచ్చు.
నిన్న ఒక ప్రధాన వార్తపత్రికలో కీలక స్థాయిలో ఉన్న వ్యక్తినుండి వచ్చిన ఆక్షేపణ ఏమిటంటే “వేణు గోపాల రెడ్డి గారు, ప్రజలలో భరోసా పెంచేందుకు మీరు వ్రాసే వ్యాసాలలో, కొంత ఆశాస్త్రీయ అంశాలు కూడా చేర్చుతున్నారు, దాని వల్ల ప్రజలలో అలసత్వం పెరుగుతుంది, జాగ్రత్త” అన్నారు. ఇంకో మిత్రులు మాట్లాడుతూ “మొదట్లో బాగా భయపెట్టారు, ఇప్పుడేమో అసలు భయపడాల్సిన అవసరం లేదు, అంటున్నారు, చాలా మారింది, మీ కంటెంట్” అన్నారు.
ఈ రెండింటికి సమాధానాలు..
- నేను వ్రాసే ప్రతీ అంశం వెనుకాల శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల సాక్ష్యాలు ఉంటాయి. నా స్వంత కథనం ఏది లేదు పరిశోధన ఫలితాల విశ్లేషణ మాత్రమే నా పని.
మొదట్లో వైరస్ గూర్చి వాస్తవాలు చెపితే తప్పించి మిత్రులు జాగ్రత్తగా ఉండరు. ఇప్పుడు కొత్త వాస్తవాలు చెప్పి భరోసా ఇస్తున్నాను. వాస్తవాల నుండి ఎపుడు దూరం జరుగలేదు. ఎప్పుడు ఏది చేయాలో అదే చేస్తున్నాను. ఇప్పుడు భరోసా ఇవ్వాల్సిన సమయం ఇది.
ప్రతీ ఆర్టికల్/ వీడియోలో కూడ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి కారణం నా వ్యాసాలపై నాకున్న నమ్మకమే (కొందరు దుర్మార్గులు ఆ వివరాలు తీసివేసి వారి పేర్లు తగిలించుకుని, ఇబ్బందులు పడ్డ కథ వేరే)…ఈ నాలుగు నెలల్లో అలా పెరిగిన మిత్రుల సంఖ్య అపరిమితం.
ఇక అసలు విషయంలోకి వస్తే, నేను చాలా కాలంగా చెబుతున్న (నాకు ఈ మధ్య అంటుకున్న పదం ఇది) విషయం ఏమిటంటే భారత్ దేశంలో అధికారికంగా వస్తున్న కేసుల సంఖ్య కన్నా ఎన్నో రెట్ల మందికి వైరస్ సోకింది అని…చాలా మంది నమ్మలేదు. అడ్డంగా కొట్టిపడేసిన వారున్నారు. భారత్ దేశంలో దాదాపు 30 కోట్ల మందికి ఇమ్మ్యూనిటి వచ్చి ఉంటుందని చాలా పోస్టింగ్స్లో ( నిన్నటి పోస్టులో కూడ) చెప్పాను. ఇప్పుడు ఆ విషయమే బయటకు వచ్చింది…
- నిన్న ఢిల్లీలో ICMR చేసిన సీరో సర్వే ప్రకారం 23% కి ఇప్పటికే వైరస్ సోకింది. అంటే, దాదాపు 46 లక్షల మందికి. వీరందరిలో ANTIBODIES ఉన్నాయి. వీరికి ఇప్పట్లో ఇక కరోన సోకే అవకాశం లేదు. ఢిల్లీలో అధికారికంగా నమోదు అయిన కేసులు ఒక లక్ష 23 వేలు మాత్రమే. అంటే అధికారిక లెక్కల కన్నా 34 రెట్ల మందికి వైరస్ సోకింది.
ఇక thyrocare దేశవ్యాప్తంగా చేసిన సీరో సర్వే ప్రకారం ఇప్పటికే 15% జనాభాకు అంటే 18 కోట్ల మందికి వైరస్ సోకి ఇమ్మ్యూనిటి వచ్చింది. అధికారికంగా ఇప్పటివరకు నమోదయిన కేసులు 10 లక్షలు మాత్రమే. అంటే వాస్తవంగా positive వచ్చిన వారికన్నా 180 రెట్ల వైరస్ వ్యాప్తి చెందింది. ఇప్పుడు ఈ 18 కోట్ల మంది కొంతకాలం సురక్షితం.
ఈ రెండు శుభావార్తలే. వైరస్ సైలెంట్గా తనపని తాను చేసుకుంటూ పోతుంది. రోగ నిరోధక వ్యవస్థ తనపని తాను చేస్తుంది. పై లెక్కలు గమనిస్తే ఢిల్లీలో మరణాల శాతం 0.07% (IFR) భారత్ లో 0.01% ( IFR) ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుంది. చాలా కాలం తరువాత కేసుల సంఖ్య 1000 లోపలికి వచ్చింది. దీనికి కారణం ప్రజలలో గతంలో ఉన్న రోగ నిరోధకత, కొత్తగా అభివృద్ధి చెందిన హెర్డ్ ఇమ్మ్యూనిటి.
వాస్తవాలు ఇలా కళ్ళకి కనబడుతున్నా, కరోన భయాందోళనకారులు, “మీరు చెప్పిందంత నిజమైనా ఢిల్లీ జనాభాలో ఇంకో 77%, భారత్ జనాభాలో 85% కి వైరస్ ప్రమాదం ఉంది”అంటున్నారు. వీరు గుర్తుంచుకోవలసింది జనాభాలో అధికశాతం మందిలో ఉండే “అంతర్గత రోగనిరోధకత” అసలు వైరస్ ని శరీరంలో స్పైక్ కూడా పెట్టనివ్వదని, పెట్టినా స్పైక్ విరగగొట్టి తరిమేస్తుందని. అసలు antibodies ఉత్పత్తి అయ్యేవరకు కథ నడుపాల్సిన అవసరం ఉండదని. ఆలాంటి వారు జనాభాలో 60% వరకు ఉంటారు. అంటే, దేశంలో చాలా జనాభా ఇప్పటికే వైరస్ పై గెలిచారు…మిగిలిన వారు గెలుస్తారు.
ఇప్పటికి వైరస్ ప్రభావం కొందరికి పొంచిఉంది. వారు రోగ నిరోధకత తక్కువ ఉన్నవారు. ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు మొదలైన వారు.ఇన్దులో మనం కూడా ఉండవచ్చు వారిని కాపాడవలసిన భాద్యత మనదే. సామాజిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, సానిటీజర్ వాడడం ద్వారా హై రిస్క్ వారికి వైరస్ పాకాకుండా చేసి కాపాడవచ్చు.
వైరస్పై గెలుపు మలుపు వద్ద ఉన్నాం. అజాగ్రత్తగా ఉంటే మళ్ళీ మొదటికి వస్తాం…ఇది కరోన వైకుంఠపాళీ జర జాగ్రత్త…
Dr. A. Venu Gopala Reddy
Microbiologist & Principal, Model School Veenavanka, Karimnagar 9948106198