- 46 వేల చెరువుల అభివృద్ధికి నిర్ణయం
- ఇప్పటికీ పూర్తయింది సగమే
- బిల్లుల్లో జాప్యంతో పనులకు బ్రేక్
హైదరాబాద్ : మిషన్ కాకతీయ… చెరువుల్లో పూడిక తీసి, కట్టలను మరింత పటిష్ఠం చేసేందుకు ఉద్దేశించిన పథకం ఇది. వర్షపు నీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఈ పథకాన్ని 2015లో ప్రారంభించారు. దీని కింద అభివృద్ధి చేసిన చెరువుల్లో ప్రస్తుతం నిండుగా నీరుంది. భారీ వర్షాలను సైతం తట్టుకుని అలుగులు పోస్తున్నాయి. అయితే.. ఇంత మంచి పథకాన్ని మధ్యలోనే వదిలేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో సుమారు 46వేల చెరువులను అభివృద్ధి పర్చాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకూ నాలుగు దశల్లో 21,436 చెరువుల్లోనే పనులు పూర్తి చేయగలిగారు. సగానికిపైగా చెరువుల పనులు చేపట్టడానికి కాం ట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల్లో పూడికతీత, వర్షాలు వచ్చినప్పుడు తట్టుకునేలా కట్టను పటిష్ఠంగా నిర్మించడం, అలుగుల నిర్మాణంతో పాటు కట్టపై ఈత, తాటి వంటి చెట్ల పెంపకం, చెరువుల్లో చేపపిల్లల పెంపకం వంటి పనులు చేపట్టాలి.
ఇప్పటి వరకూ 4 దశల్లో ఈ పథకాన్ని అమలు చేశారు. మొత్తం 27,625 చెరువులను అభివృద్ధి చేయాలని నిర్ణయించి.. రూ.9,155 కోట్లను కేటాయించారు. అయితే, ఇప్పటి వరకు 21,436 చెరువుల్లోనే పనులు పూర్తి చేశారు. ఈ పథకాన్ని చేపట్టిన మొదట్లో పనులు చా లా వేగంగా పూర్తయ్యాయి. మొదటి, రెండో దశల్లో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగా, 3, 4వ దశల్లో చేపట్టిన పనులు నత్తనడకన నడిచాయి. ఈ రెండు దశల్లో కలిపి 10 వేలకుపైగా చెరువులను అ భివృద్ధి చేయాల్సి ఉండగా.. 5వేల చెరువుల్లోనే పను లు పూర్తయ్యాయి. ఇప్పటికీ పనులు మొదలు పెట్ట ని చెరువుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మిషన్ కాకతీయ.. వేగం తగ్గడానికి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండడమే కారణమని తెలుస్తోంది. ఈ పనులు చేసే వారంతా చిన్న కాం ట్రాక్టర్లే.. బిల్లుల చెల్లింపులో జాప్యంతో వారు తీవ్రం గా నష్టపోతున్నారు. పనులు చేసిన తర్వాత ఏడాదికి, రెండేళ్లకు బిల్లులు ఇస్తుండడంతో.. పనులు చేపట్టడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. కాగా, ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని 27,739 చెరువులు పూర్తిగా నిండాయి. ఈ చెరువుల ద్వారా 8.42 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతున్నారు. అలాగే, వీటి పరిధిలో సుమా రు 15.05లక్షల ఆయకట్టు సాగులోకి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. మిషన్ భగీరథ కింద చేపట్టిన పనులతో చెరువులకు గండ్లు పడడం కూడా తగ్గింది. ఇన్ని ప్రయోజనాలున్న నేపథ్యంలో మిగిలిన చెరువుల అభివృద్ధి పనుల్ని కూడా పూర్తి చేస్తే… మరింత లబ్ధి చేకూరుతుందని రైతులు ఆశిస్తున్నారు.
Courtesy Andhrajyothi