లొంగుబాటు దిశగా మరో మావోయిస్టు నేత
హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత కూడా లొంగిపోయే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలంగాణ పోలీసుల వద్ద ఉంది. కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావుతోపాటే వేణుగోపాల్ కూడా లొంగిపోయేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
సుదీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న భూపతి.. ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా, మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంలో పనిచేసిన కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావుకు వేణుగోపాల్ తమ్ముడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లికి చెం దినవారు. పీపుల్స్ వార్ గ్రూప్లో నాయకుడిగా మల్లోజుల వేణుగోపాల్ అ లియాస్ భూపతి అలియాస్ సోను అలియాస్ మాస్టర్ అలియాస్ అభయ్ పేర్లతో పనిచేశారు.
మహారాష్ట్రంలోని గడ్చిరోలి మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2010లో చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్ మరణం తర్వాత వేణుగోపాల్ మావోయి స్టు పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. పార్టీ ప్రచురణల వి భాగంలోనూ బాధ్యతలు నిర్వహించారు. 2010లో దంతెవాడ ఘటనలో 70 మందికిపైగా సీఆర్పీఎఫ్ బలగాలు మృతి చెందడం వెనక వేణుగోపాల్ ప్రమేయం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
2011లో ఎన్కౌంటర్లో కిషన్జీ మృతి చెందిన తర్వాత వేణుగోపాల్ను పశ్చిమ బెంగాల్లోని ఆపరేషన్ గ్రీన్హంట్కు వ్యతిరేకంగా జరుగుతున్న లాల్గఢ్ ఉద్యమానికి నాయకునిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చత్తీ్సగఢ్ పోలీసులు మల్లోజుల వేణుగోపాల్ తలపై పెద్ద మొత్తాన్ని రివార్డుగా ప్రకటించారు.