లాస్ ఏంజెల్స్ : లాస్ఏంజెల్స్ పోలీసు అధికారులు మరో నల్ల జాతీయుడిని కాల్చి చంపారు. సైకిల్పై వెళుతున్న అతడిని ఆగాల్సిందిగా పోలీసులు కోరారు. ఆ తర్వాత ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిరసనలు వెల్లువెత్తాయి. జార్జి ఫ్లాయిడ్, ఆం డ్రెస్ గార్డావోల హత్యల అనంతరం చెలరేగిన ఆగ్రహావే శాలు ఇంకా కొనసాగుతుండగానే ఈ దారుణం చోటు చేసుకుంది. సైకిల్పై వెళుతున్న 29ఏండ్లు డిజాన్ కిజ్జిని ఇద్దరు పోలీసు అధికారులు ఛేజింగ్ చేశారని లెఫ్టినెంట్ బాండన్డీన్ తెలిపారు. వాహన నిబంధనలను ఉల్లం ఘించారనే కారణంపై ఆగాలని కిజ్జిని కోరారు. అయితే ఏనిబంధనలు ఉల్లంఘించారనేది ఇంతవరకు తెలియ రాలేదు. పోలీసు శాఖ జారీ చేసిన ప్రకటన ప్రకారం, పోలీసు అధికారి వాహనాన్ని కిజ్జి పంచ్ చేశాడు, తన బట్టల మూటతో తుపాకీని పడేశాడు. దాంతో కిజ్జి సైకిల్ ను ఆపారు. కిజ్జి హత్యకు జవాబుదారీ వహించాలంటూ వందలమంది ప్రజలు పోలీసు స్టేషన్కు ప్రదర్శనగా వెళ్ళారు. ‘న్యాయం జరగకపోతే, శాంతి లేదు.’ అని నినాదాలు చేశారు.
జూన్లో సాల్వడార్కి చెందిన 18 ఏండ్ల కుర్రాడు ఆండ్రెస్ గార్డావోను హత్య చేసిన అనం తరం కొనసాగుతున్న నిరసనలు, ఆగ్రహావేశాలు మళ్ళీ ఈసంఘటనతో పెచ్చరిల్లాయి. శ్వేతజాతీయుల ముఠాల తో సంబంధాలున్నాయని లాస్ఏంజెల్స్ సబ్ డివిజన్ పోలీసు అధికారులు పలు ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. పైగా బాధిత కుటుంబాలను వేధిస్తూ, వారు న్యాయం కోసం లేదా నష్టపరిహారం కోరుతూ కోర్టు గుమ్మాలు ఎక్కకుండా వుండేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ‘ఈ సంఘటనపై మా దర్యాప్తు సాగించేందుకు మాకు కొంత సమయం ఇవ్వండి’ అని బాండన్ కోరారు. ఈ కేసులో వాస్తవాలను తెలుసుకుని వాటిని మీ ముందుంచుతామని తెలిపారు.
Courtesy: NT