హైదరాబాద్: కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. పశ్చిమ బెంగాల్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి సంపూర్ణ లాక్డౌన్ పాటిస్తున్నారు. మరోవైపు కోల్కతాలో కూడా సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు.
వాహనాలకు అనుమతి లేదు. రాష్ట్రంలో వారానికి రెండు రోజుల పాటు లాక్డౌన్ను ఆగస్టు 31వ తేదీ వరకు అమలు చేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మధ్యప్రదేశ్లో కూడా ఈరోజునుంచి పది రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ పాటించనున్నారు. అటు భూపాల్లో కూడా ఆగస్టు 4వ తేదీ వరకు లాక్డౌన్ విధించనున్నారు. పోలీసులు అత్యవసర పరిస్తితిలో ఐడీ కార్డులు చూపించిన తర్వాతనే ప్రజల ప్రయాణానికి అనుమతిస్తున్నారు.