హైదరాబాద్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు అవార్డుకు వరంగల్ జిల్లాకు చెందిన కవి, కథారచయిత రామా చంద్రమౌళిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వరంగల్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేసి పదవీ విరమణ చేసిన రామా చంద్రమౌళి దీపశిఖ, స్మృతిధార, అంతర్దహనం, అంతర, అసంపూర్ణ సహా పలు రచనలు చేశారు. ఆయన రాసిన కాల నాళిక నవల తెలంగాణ ఉద్యమ పరిణామాన్ని ఆవిష్కరించిందని ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అవార్డుకు ఎంపికైన రామా చంద్రమౌళిని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందించారు.