రాయితీల మేరకు పేదలకు ఉచిత చికిత్స అందించాల్సిందే
జీవోలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండి.. హైకోర్టు ఆదేశం
కొవిడ్పై ప్రభుత్వ చర్యలు అభినందనీయమని ప్రశంస
సర్కారుకు హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు
ప్రభుత్వ చర్యలు అభినందనీయం
డబ్ల్యూహెచ్వో ప్రకటన ఓ హెచ్చరిక: సీజే
వ్యక్తిగత హాజరు.. సీఎస్కు మినహాయింపుహైదరాబాద్, ఆగస్టు: ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని హైకోర్టు ధర్మాసనం సూచించింది. కరోనా చికిత్సకు సంబంధించి ప్రభుత్వ జీవోలు అమలయ్యేలా చూడాలని, వాటిని ఉల్లంఘించే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. ‘‘ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను పరిగణనలోకి తీసుకోవాలి. పేదలకు ఉచిత చికిత్సలు అందించేందుకు కట్టుబడి ఉండాలి. వాటిలో ఎంతమంది పేదలకు ఉచితంగా చికిత్స అందించారో తేల్చాలి. అందించకపోతే లోపాలు ఎక్కడున్నాయో గుర్తించాలి. ఢిల్లీ తరహాలో ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇందుకు ఉత్తర్వులు జారీ చేయాలి. అందుకు అవకాశం లేకపోతే కారణాలను కోర్టుకు చెప్పాలి’’ అని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై ధర్మాసమండిపడింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించారంటూ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడాన్ని తప్పుబట్టింది. ప్రభుత్వ ఆదేశాలు పాటించని ప్రైవేటు ఆస్పత్రుల్లో 50ు పడకలను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర మంతి ప్రకటించారు.. అదెంత వరకు వచ్చిందని ఆరా తీసింది. ప్రభుత్వం నుంచి పలు రాయితీలు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు.. 25 శాతం మంది పేదలకు ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించాయని, దానిని ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. కొవిడ్-19పై దాఖలైన సుమారు 20 ప్రజాహిత వ్యాజ్యాలను సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది.
ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్.. ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ కౌంటర్ దాఖలు చేశారు. ధర్మాసనం నిర్దేశించిన వాటిలో 95ు పూర్తి చేశామని, మరో 5ు చేయాల్సి ఉందంటుని చెప్పారు. ఈ కౌంటర్ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సీజే జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం.. కొవిడ్-19 కట్టడికి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయంగా ఉన్నాయని మెచ్చుకుంది. మిగిలిన ఆదేశాలను సెప్టెంబరు నాలుగో తేదీలోగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. భారతదేశంలో కరోనా వైరస్ ఇంకా గరిష్ఠ స్థాయికి చేరుకోలేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) చేసిన ప్రకటనను ప్రధాన న్యాయమూర్తి చౌహాన్ ప్రస్తావించారు. ఇది ఒక విధంగా హెచ్చరిక.. మరో విధంగా కరోనాపై మనం సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉందనడానికి సూచిక అని అభిప్రాయపడ్డారు. తదుపరి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి సీఎ్సను మినహాయించారు. తదుపరి విచారణను సెప్టెంబరు 4కి వాయిదా వేశారు.
సమాచారాన్ని దాచట్లేదు
ఐసీఎంఆర్ అనుమతించిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు సత్ఫలితాలను ఇస్తున్నాయని, 15 నిమిషాల్లోనే ఫలితం వస్తున్నందున తక్షణ చర్యలు చేపట్టేందుకు డాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉందని సీఎస్ సోమేశ్కుమార్ కోర్టుకు తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఫలితాలు రావడానికి 3 రోజులు పడుతోందని, దాంతో, పాజిటివ్ రోగులకు సకాలంలో చికిత్స అందించలేకపోతున్నారని, ఇది వైరస్ వ్యాప్తికి దోహదపడుతోందని చెప్పారు. కొవిడ్-19 నియంత్రణకు వైద్యులు, ఉన్నతాధికారులు సహా రాష్ట్ట్ర యంత్రాంగం అవిశ్రాంతంగా కృషిచేస్తున్నట్లు ధర్మాసనానికి నివేదించారు. ఎలక్ర్టానిక్ విధానంలో సంపూర్ణ సమాచారం సేకరించలేమని, అందుకే తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. చాలామంది అధికారులు నిద్రలేమి బారిన, మరికొందరు కరోనా బారిన పడ్డారని చెప్పారు. 1,100 కేంద్రాల నుంచి సమాచారం సేకరించడం కష్టతరమైనా.. అధికారులు దానిని సేకరించి, సమ్మిళితం చేసి కోర్టుకు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనాకు సంబంధించిన ఎలాంటి సమాచారం దాచడం లేదని, పూర్తి సమాచారం కోర్టు ముందు ఉంచేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎన్ని ఇబ్బందులెదురైనా ఎదుర్కొని కరోనా మహమ్మారి నివారణకు పని చేస్తున్నామని, ఈ అంశాన్ని ధర్మాసనం గుర్తించాలని కోరారు. ‘‘గురువారంనాటికి రాష్ట్రంలో 1.78లక్షల కరోనా పరీక్షలు చేశాం. వాటిలో 50 వేలు ప్రైమరీ కాంటాక్టులు. 42 వేలు సెకండరీ కాంటాక్టు కేసులు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు అవసరం లేదు. అధిక శాతం మంది ఇంటివద్దే చికిత్స పొందవచ్చు. వరంగల్ ఎంజీఎంలో 651 పడకలు ఏర్పాటు చేస్తున్నాం. వాటిలో 100 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాం. ఇప్పటికే 60 పడకలు ఆస్పత్రికి అప్పగించాం’’ అని తెలిపారు.
మృతదేహాలను తరలించేందుకు 61 వాహనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పడకల వివరాలను డిస్ప్లే బోర్డుల్లో ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలను కోర్టు పరిశీలనకు ఇచ్చారు. ఆ వివరాలను జీహెచ్ఎంసీ, వైద్య శాఖ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. ‘హితం’ యాప్పై ప్రచారం గురించి ప్రస్తావిస్తూ.. దీనికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం లేదని సీఎస్ తెలిపారు. పూర్తి సమాచారం ప్రభుత్వం వద్దే ఉంటుందని, కరోనా సోకిన వారిని డాక్టర్లు ఫోన్ ద్వారా సంప్రదిస్తున్నారని, రోగులు ఇచ్చే సమాచారం ప్రకారం చికిత్స అందిస్తున్నారని వివరించారు. రోగికి వైద్య సహాయం అవసరమైతే.. ఒక్క బటన్ నొక్కితే చాలని, తర్వాత విషయాన్ని వైద్యులు చూసుకుంటారని చెప్పారు. ఈ విధానాన్ని నీతి ఆయోగ్ అభినందించిందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోల ప్రకారం చికిత్స అందించని ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించి నోటీసులు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 50 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులపై వచ్చే ఫిర్యాదుల్లో కొన్ని వ్యాపార పోటీతో చేసేవి ఉంటాయన్నారు. లేబరేటరీ పరీక్షలకు 2019 డిసెంబరులో ఉన్న ధరల ప్రకారం వసూళ్లు చేయాలని ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే వాటి లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా ప్రజాహిత వ్యాజ్యాలు వేస్తున్నారని, అందువల్ల వాటి స్ఫూర్తి నెరవేరడం లేదని చెప్పారు.
కోర్టు ఆదేశాలు ఇవీ..!
ప్రభుత్వం జారీ చేసే మీడియా బులెటిన్లలో ఎన్ని ప్రైమరీ కాంటాక్టు కేసులున్నాయి.. ఎన్ని సెకండరీ కాంటాక్టు కేసులున్నాయో తెలపాలి. లక్షణాలున్న వారికి ఎన్ని టెస్టులు చేశారు? లక్షణాలు లేనివారికి ఎన్ని చేశారో చెప్పాలి. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ మధ్య 1,78,609 టెస్టులు చేశామన్నారు. వాటికి సంబంధించిన వివరాలు ఇవ్వలేదు.
21-51 మధ్య వయస్కులను అప్రమత్తం చేయాలి. ఆ గ్రూపులో కరోనా సోకిన వారి వివరాలు ఇవ్వాలి. ఇప్పటికీ ప్రభుత్వం ఆ వివరాలను బులెటిన్లలో ఇవ్వడం లేదు. ఇకపై ఇస్తుందని భావిస్తున్నాం.
కరోనా బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పౌరసమాజంతో కలిసి ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తామంటూ ఎన్జీవోలు ముందుకు వచ్చాయి. రసూల్పురలోని హాకీ స్టేడియం వాటికి కేటాయించే అంశాన్ని పరిశీలించాలి. ఆ దరఖాస్తులపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి.
అన్ని జిల్లాల్లోని వేర్వేరు ఆస్పత్రుల్లో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంపుదలకు సంబంధించిన వివరాలను ఒక పట్టిక రూపంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టు పరిశీలనకు ఇవ్వాలి. కొవిడ్-19 చికిత్స అందించేందుకు సిబ్బంది కొరత ఉంది. సిబ్బంది సంఖ్య పెంచాలి. నిబంధనల ప్రకారమే మంత్రులు, అధికారులు సమావేశాలు నిర్వహించాలి.