- నగరంపై అలముకున్న పొగ..
- అది కరోనా మృతులను దహనం చేయగా వస్తున్న పొగే?
- స్థానికుల ఆందోళన
- మృతుల సంఖ్య ప్రకటిస్తున్న దానికన్నా ఎక్కువే
- పాశ్చాత్య పత్రికల సంచలన కథనాలు
పొగలు కమ్ముకుంటున్నాయి? అవి కేవలం అనుమానపు పొగలా? లేక.. కరోనా వైరస్ మృతుల చితిమంటలు పొగలా?. చైనాలోని వూహాన్ నగరంలో కరోనా మహమ్మారి మృత్యుఘంటికలు మోగిస్తోందని, చైనా ప్రభుత్వం చెబుతున్న దానికంటే ఎక్కువ విలయమే చోటుచేసుకుందని బ్రిటన్ ప్రత్రిక ‘డెయిలీ స్టార్’ పేర్కొంది. కరోనా భూతాన్ని కట్టడి చేసేందుకు చైనా ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది.
లండన్ : ‘కరోనా వైరస్ ఇన్ఫెక్షన్తో 426 మంది మరణించారు.. 20 వేల మందికిపైగా దాని బారిన పడ్డారంటూ వస్తున్న ఆందోళనకరమైన వార్తలకన్నా దారుణమైన పరిస్థితులు చైనాలో ఉన్నాయ’ంటూ పలు విదేశీ పత్రికలు సంచలన కథనాలను ప్రచురిస్తున్నాయి. కరోనా వైరస్ మృతులు, దాని బారిన పడినవారి సంఖ్య విషయంలో చైనా అధికారికంగా చేస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితికి పొంతన లేదని అంటున్నాయి. ‘వూహాన్ నగరాన్ని కప్పేస్తున్న దట్టమైన ‘మృత్యు ధూమం’ ఒక వీడియోను వైరల్ చేస్తున్నాయి.
ఆ పొగ ఎక్కడి నుంచి వస్తోందో తెలియట్లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. కరోనా వైరస్ బారిన పడి మరణించినవారిని కాల్చగా వచ్చిన పొగేనన్న సందేహాలను వెలిబుచ్చుతున్నారని చెబుతున్నాయి. కరోనా బారిన పడి మృతిచెందినవారిని ఖననం చేయొద్దని.. వారి మృతదేహాలను దహనం చేయాలని చైనా జాతీయ హెల్త్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వూహాన్లో కరోనా కారణంగా భారీగా చనిపోతున్నవారిని దహనం చేస్తున్నారని, నగరాన్ని చుట్టేస్తున్న పొగ అదేనని స్థానికులు అభిప్రాయపడుతున్నారని విదేశీ పత్రికలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్లను పోస్ట్ చేస్తున్నాయి.
అయితే, వారి సందేహాన్ని రుజువు చేసే బలమైన సాక్ష్యమేదీ లేదని.. వూహాన్ కాలుష్యభరిత నగరాల్లో ఒకటని పేర్కొంటూ దానికి సంబంధించిన గణాంకాలను ప్రచురించాయి. కాగా, వూహాన్కు చెందిన ఫాంగ్బిన్ అనే వ్యక్తి అక్కడి ఒక ఆస్పత్రిలో చిత్రీకరించిన వీడియోలోని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను ఉంచిన సంచులను వైద్యులు ఒక బస్సులో వేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఆ వీడియో తీసిన బిన్ను పోలీసులు అరెస్టు చేశారు.
చైనాకు ఆవల రెండో ‘కరోనా’ మృతి
చైనాకు ఆవల రెండో ‘కరోనా’ మరణం హాంకాంగ్లో నమోదైంది. హాంకాంగ్కు చెందిన 39 ఏళ్ల వ్యక్తి నెల రోజుల క్రితం వూహాన్కు వెళ్లినప్పుడు వైరస్ బారిన పడ్డాడు. మంగళవారం అతడు మరణించాడు. కాగా.. కరోనా వైరస్ బారిన పడుతున్నవారిలో మరణిస్తున్నవారు 2.1ు కాగా.. వారిలో 80 శాతం మంది వృద్ధులే. అందులోనూ మగవారే ఎక్కువగా ఉన్నారు.
Courtesy Andhrajyothi