* భారీగా తగ్గుతున్న కేంద్ర నిధులు
* నేడు సిఎం సమీక్ష
– అమరావతి
వివిధ ప్రాయోజిత పథకాల అమలుకోసం కేంద్రం నుండి రాష్ట్రానికి వస్తున్న నిధులు భారీగా తగ్గుతున్నాయి. సొంత వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగకపోవడం, కేంద్రం నుండి కచ్చితంగా వస్తాయని భావిస్తున్న నిధుల్లో కూడా కోత పడుతుండటం రాష్ట్ర ప్రభుత్వంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం కేంద్ర ప్రాయోజిత పథకాలు, వాటి నిధులపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఈ సమావేశం శుక్రవారం జరగనుంది. అధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది . కేవలం 35 శాతం నిధులు మాత్రమే విడుదలయ్యాయి. ఈ నిధులు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా విడుదల కావడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. దాదాపు 25 శాఖలకు కేంద్రం నురచి వివిధ పనులకు నిధులు రావాల్సి ఉరటురది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కొరత నిధులను జత చేసి పనులను నిర్వహిరచాల్సి ఉరటురది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధిరచి 18,004 కోట్ల రూపాయలు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులుగా రావాల్సి ఉన్నప్పటికీ, అక్టోబర్ వరకు కేవలం 6,744 కోట్లు మాత్రమే వచ్చిరది. అరటే మిగిలిన ఐదు నెలల్లో ఇరకా 11 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉరటురదని అరచనా వేస్తున్నారు. ఏడు నెలల్లో వచ్చిరది 35 శాతం వరకు మాత్రమే కాగా, మిగిలిన నెలల్లో 65 శాతం ఎలా వస్తురదని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సిఎస్ఎస్ పథకాలకు కేంద్రం 60 శాతంనిధులు ఇస్తే మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిరచాల్సి ఉరటురది. అయితే కేంద్రం నిధులు తగ్గిపోవడం వల్ల రాష్ట్ర వాటా నిధులు కూడా సక్రమంగా వినియోగం జరగడం లేదని అధికారులు అరగీకరిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, వైద్య ఆరోగ్యశాఖ, విద్య, పౌరసరఫరాలు, గృహ నిర్మాణాల వరటి శాఖలపై నిధుల లేమి ప్రభావం ఎక్కువగా పడుతున్నట్లు తెలిసిరది. ఈ అరశాలపై చర్చిరచి, ఇరకా ఎరత నిధులు రావాల్సి ఉరటురది, ఆయా పనులతో నిర్వహిస్తున్న పథకాల పరిస్థితి ఏమిటన్న అరశాలపై జగన్ సమీక్షిరచనున్నారు. నిధుల విడుదల గురించి అవసరమైతే కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, ఆ శాఖల అధికారులను ఢిల్లీకి పంపాలని భావిస్తున్నట్లు సమాచారం.
Courtesy Prajasakti..