- కేరళలోని త్రిశూర్లో తొలి పాజిటివ్ కేసు
- వైరస్తో మలేసియాలో త్రిపుర వాసి మృతి
- 17 దేశాల్లో వైరస్ ప్రభావం
- చైనాలో 170కు చేరిన మృతులు
- ఆ దేశంతో సరిహద్దును మూసేసిన రష్యా
- హాంకాంగ్లో మాస్క్లకు జనం బారులు
బీజింగ్, న్యూఢిల్లీ, తిరువనంతపురం/హైదరాబాద్ : చైనాను నిలువునా వణికిస్తున్న కరోనా వైరస్ భారత్కూ పాకింది. కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లాలో గురువారం తొలి పాజిటివ్ కేసు నమోదైంది. చైనాలోని వుహాన్ విశ్వవిద్యాలయంలో చదువుతూ ఇటీవల కేరళకు వచ్చిన నలుగురిలో ఒక విద్యార్థిని వైరస్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆమెను త్రిశూర్ జనరల్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. మిగతావారి నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు కరోనా కారణంగా తొలిసారి ఓ భారతీయుడు మృతిచెందాడు. వైరస్ సోకి.. త్రిపురకు చెందిన మనీర్ హొస్సేన్ (23) చనిపోయినట్లు బుధవారం అతడి బంధువులకు సమాచారం అందింది. మనీర్ మలేసియాలోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు.
వైరస్ ప్రబలలేదని స్పష్టమవడంతో ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి గురువారం ముగ్గురిని డిశ్చార్జి చేశారు. కాగా, కరోనాతోచైనాలో మరణాల సంఖ్య మరింత పెరిగి 170కి చేరింది. ఏడు వేలకు పైగా కేసులు నిర్ధారితమయ్యాయి. వీరిలో 1,370 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. ఇక కరోనా థాయ్లాండ్, సింగపూర్, ఆస్ర్టేలియాలో, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్ సహా 17 దేశాలకు వ్యాపించినట్లు గుర్తించారు. దీంతో చైనీయులకు ఎలకా్ట్రనిక్ వీసాల జారీ సహా ఆ దేశంతో ఉన్న సరిహద్దులను మూసివేస్తున్నట్లుగా రష్యా ప్రకటించింది. రక్షణ చర్యల్లో భాగంగా హాంకాంగ్లో జనం మాస్క్ల కోసం మెడికల్ షాపుల ముంగిట బారులు తీరుతున్నారు. హాంకాంగ్ నుంచి మిలన్ వెళ్లి.. అక్కడినుంచి క్రూయిజ్లో విహార యాత్రకు బయల్దేరిన చైనా జంటను కరోనా అనుమానంతో ప్రత్యేకంగా పరీక్షిస్తున్నారు.
Courtesy Andhrajyothi