ఆ సంస్థను తన చెప్పుచేతల్లో పెట్టుకుంది
బీజేపీ నేతల రెచ్చగొట్టే పోస్టులపై చర్యల్లేవ్
హింసను ప్రేరేపిస్తున్నా తొలగించలేదు
ఇతర నేతల పోస్టులపైనా చర్యలు శూన్యం
భారత సర్కారుకు భయపడే: మాజీ అధికార్లు
వాల్స్ర్టీట్ జర్నల్ సంచలనాత్మక కథనం
ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్టుల ప్రస్తావన
ట్విటర్లో దుమ్మెత్తిపోసిన రాహుల్ గాంధీ
తిప్పి కొట్టిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ను భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన గుప్పిట్లో పెట్టుకుందా? బీజేపీ నేతలు హింసను ప్రేరేపించేలా, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నా.. వీడియోలను షేర్ చేస్తున్నా.. ఫేస్బుక్ చూసీ చూడనట్లు వదిలేస్తోందా? ఈ ప్రశ్నలకు ఔననే అంటోంది అమెరికాకు చెందిన అంతర్జాతీయ పత్రిక వాల్స్ర్టీట్ జర్నల్(డబ్ల్యూఎ్సజే) కథనం. ఫేస్బుక్ ఇండియా ఉన్నతాధికారి అంకిత్ దాస్ బీజేపీని భుజాలకెత్తుకున్నారు. ఆ పార్టీ నేతల ఫేస్బుక్ పేజీల్లో ఉన్న వివాదాస్పద పోస్టులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫేస్బుక్ ప్రజావిధానాల విభాగం ఉద్యోగులు ఆ సాహసం చేయకుండా అడ్డుకుంటున్నారు. అదేమంటే.. భారత ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతింటాయని.. ఫలితంగా భారత్లో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతుందని అంకిత్ చెబుతున్నారు. అని ఆ సంస్థ మాజీ, ప్రస్తుత అధికారులు పేర్కొన్నట్లు డబ్ల్యూఎ్సజే కథనం వెల్లడించింది.
Courtesy Andhrajyyothi