హైదరాబాద్: కరోనా రోజుల్లో ఇంటి నుండి పనే ఉత్తమమని చాలా మంది ఉద్యోగులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. కరోనా తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఇంటి నుండి పనిచేయడం వలన చాలా సమయం కలిసొస్తుందని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వలన తమ కంపెనీలకే లాభమని అంటున్నారు. కంపెనీలో అయితే హై స్పీడ్ ఇంటర్నెట్, కొలిగ్స్ ఉంటారని ఐటీ ఉద్యోగులు తమ అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.కరోనా వైరస్ అన్ని రంగాలపై ప్రభావం పెరుగుతుండం, ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో చాలా వరకు కంపెనీలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్కే ప్రాధాన్యత పెరిగింది. కోరోనా మొహమ్మరితో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని మరికొంతమంది వారి అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.