- మోడీ సర్కార్కు పట్టని తక్షణ చర్యలు
- కాశ్మీర్, అసోం, అయోధ్య అంశాలతో బీజేపీ రాజకీయం
- భావోద్వేగ ప్రకటనలతో సరి
దేశంలో ఓవైపు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే కేంద్రం మాత్రం జాతీయవాదాన్ని ముందుకు తెస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నది. ఈ ఏడాది వరుసగా రెండో త్రైమాసికంలోనూ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5 శాతానికి పడిపోయింది. గత త్రైమాసికంలోనూ ఇది 5.8 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. కాగా, భారత ఆర్థిక వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న తయారీ రంగంతో పాటు పలు కీలక రంగాలు మునుపెన్నడూ లేని విధంగా మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆటోమొబైల్ రంగంలో ఇప్పటికే 3 లక్షల ఉద్యోగాలు గల్లంతైనట్టు వార్తలు వస్తుండగా.. త్వరగా అమ్ముడుపోయే వస్తువుల (ఎఫ్ఎంసీజీ) రంగం కూడా సంక్షోభంలో చిక్కుకున్నది. జీఎస్టీ భారంతో రూ.5 బిస్కెట్ కొనడానికి సైతం వినియోగదారులు మొగ్గు చూపకపోవడంతో.. పార్లే-జీ, బ్రిటానియా వంటి సంస్థలు ఉద్యోగులకు కోత విధించడానికి సిద్ధపడుతున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులతో విదేశీ పెట్టుబడిదారులు సైతం భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. సమస్త రంగాలు సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతుంటే కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రం ఇవేవీ సమస్యలే కానట్టు వ్యవహరిస్తున్నదని రాజకీయ, ఆర్థిక నిపుణులు విమర్శిస్తున్నారు. దేశంలో తరుముకొస్తున్న సంక్షోభాన్ని నివారించకుండా.. ప్రజలను ఆ వైపుగా ఆలోచించకుండా ఉంచేందుకే నిన్నా మొన్నటి దాకా కాశ్మీర్, అయోధ్య, జాతీయవాదాన్ని ముందుకు తెచ్చిన బీజేపీ సర్కారు.. ఇప్పుడు రెండ్రోజుల క్రితమే అసోంలో విడుదలైన ఎన్నార్సీ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి.
వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి చేరుకోలేదు. మోడీ సర్కారు తీసుకుంటున్న అనాలోచిత ఆర్థిక నిర్ణయాల ఫలితమే ప్రస్తుత సంక్షోభానికి కారణమని ఆర్థిక నిపుణులు గొంతెత్తి మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాగా, సంక్షోభ నివారణకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు కూడా ఆశాజనకంగా లేవన్నది విమర్శకుల వాదన. ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా కార్పొరేట్లకు ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా ఒరిగేది శూన్యమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దేశాన్ని ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించడానికని పది ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేసిన సర్కారు నిర్ణయంలో.. ప్రజల సొమ్మును కార్పొరేట్లకు మళ్లించే ఉద్దేశమే తప్ప మరోటి లేదని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇక, తాము అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ సర్కారు.. దేశంలో నిరుద్యోగిత రేటును 45 ఏండ్ల గరిష్ట స్థాయికి తీసుకెళ్లిన విషయం విదితమే. ఈ నివేదికను సైతం తొలుత అంగీకరించని కేంద్ర సర్కారు.. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో ప్రకటిం చింది. ఉద్యోగాల కల్పన సంగతి అటుంచితే దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులతో ఉన్న ఉద్యోగాలు సైతం ఊడుతు న్నాయి.
దేశం ఆర్థికంగా దివాలా తీస్తుంటే కేంద్రం మాత్రం కాశ్మీర్ అంశంతో ప్రజలను జాతీయవా దంలో ముంచెతు ్తతున్నది. తనకు అనుకూల మీడియాతో దేశభక్తి కథనాలు వడ్డించడమే గాక సామాజిక మాధ్యమాలలో దీనిపైన అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేయిస్తున్నదని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు. మరోవైపు అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ కొనసాగుతుండగానే.. దానినీ రాజకీయం చేస్తూ ప్రజల దృష్టిని మరల్చుతున్నది. తాజాగా.. అసోంలో విడుదలైన జాతీయ పౌర ముసాయిదా (ఎన్నార్సీ)లోనూ 19 లక్షల మందిని భారతీయులు కాదని కేంద్రం తేల్చింది. దీంతో వీరందరూ తాము ఏ దేశానికి చెందినవారమో తేల్చుకోవాల్సిన దుస్థితిని కేంద్రం కల్పించింది. జాబితాలో పేర్లు కోల్పోయిన వారిలో అత్యధికులు ముస్లింలేనన్న వార్తలు వస్తున్నాయి. వీరందరూ దేశం విడిచి వెళ్లడమో లేక చేయని నేరానికి జైళ్లలో మగ్గడం తప్ప మరో దారి లేని పరిస్థితి నెలకొన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుత ున్నారు. ఇది వెలువడినానంతరం పలు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులు సైతం తమ రాష్ట్రాల్లోనూ ఎన్నార్సీని అమలుపర్చాలని డిమాండ్ చేస్తూ.. దిగజారుతున్న జీడీపీని కాకుండా దేశ ప్రజలను జాతీయవాదం వైపు మళ్లించడానికి ఈ అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
(COURTECY NAVA TELANGANA)