ఆర్టీసీ కార్మికులకు అండగా పోరాడుతాం: చాడ
ఆదిలాబాద్ టౌన్: ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హుజూర్నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎ్సకు మద్దతు విరమించుకుంటున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ సమ్మెకు ముందు టీఆర్ఎ్సకు మద్దతు ఇవ్వాలనుకోవడం వాస్తవమేనని, కానీ.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకూ వారికి అండగా ఉండి పోరాడుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఆంధ్రోళ్లు కాదని.. వారిపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సీఎం కేసీఆర్కు హితవు పలికారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు చాడ వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. అంతకుముందు సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ చిన్నవాడైనా.. ఆయన అడుగుజాడల్లో సీఎం కేసీఆర్ నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమ్మె కారణంగా మనోవేదనకు గురై ముగ్గురు కార్మికులు మృతి చెందారని, దీనికి కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Courtesy Andhra Jyothy