ఎల్లాపటారు వెళ్లి వెతికాడు. అక్కడా లేకపోవడంతో ఆటోలో జైనూర్లోనూ గాలించాడు. ఫలితం లేకపోవడంతో లింగాపూర్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎప్స్ వెంకటేష్ ఆధ్వర్యంలో రామునాయకతండా, ఎల్లాపటార్, గోపాలపూర్ చుట్టుపక్కల గ్రామాల్లో వెతికారు. మర్నాడు సోమవారం ఉదయం రామునాయక్ తాండ శివారులో ఓ మహిళ శవాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. వివస్త్రగా, బలమైన కత్తిపోట్లతో ఉన్న ఆ మృతదేహం లక్ష్మీదిగా గుర్తించారు. గోపికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, జైనూర్ సీఐ సురేష్ చేరుకుని విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో నిందితులను పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. ఎల్లాపట్టార్ గ్రామానికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మిపై లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసినట్టు భావిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు డీఎస్పీ భరోసా ఇచ్చారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం భాగంగానే ఆర్టికల్ 370 రద్దు, కార్మిక చట్టాల్లో మార్పులు, పౌరసత్వ సవరణ బిల్లులో సవరణలు తీసుకువచ్చింద న్నారు. దేశంలో హిందువులు ప్రథమ పౌరులుగా ఉండాలనే విధానంతో ముందుకు సాగుతుందన్నారు. డీఎల్ఎఫ్ కన్వీ నర్ నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ… కాషాయీకరణ పేరుతో బీజేపీ ప్రభుత్వం దళితులు, ముస్లింలు, గిరిజనులు, రచయితలపై దాడులు చేస్తుందన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటుందని, గోసంరక్షణ పేరుతో ముస్లింలు, దళితులపై మూకదాడులు చేస్తున్నార న్నారు. సమితి అధ్యక్షులు బండారు లక్ష్మయ్య మాట్లాడు తూ… విద్యారంగంలోనూ కాషాయీకరణ తీసుకువచ్చి విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. సెంట్రల్ యూని వర్సిటీలో వామపక్ష, దళిత బహుజన, మైనార్టీ విద్యార్థుల పై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారన్నారు. ప్రొఫెసర్ చక్రధర్ రావు మాట్లాడుతూ… మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామన్నారు. కార్యక్రమంలో ఓపీడీఆర్ కన్వీనర్ భాస్కర్ రావు, ప్రొఫెసర్లు కె. శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, పద్మజా షా, కె.వై. రత్నం, ఎంసిపిఐ నాయకులు మద్దికాయల అశోక్, బూతం వీరయ్య, తెలంగాణ లోక్ సత్తా అధ్యక్షులు మన్నారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Courtesy Sakshi