పొట్టకూటి కోసం వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు లాక్డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడులోని తిరుప్పూర్ నుంచి ఒక లారీలో 57 మంది వలస కూలీలు కిక్కిరిసి మధ్యప్రదేశ్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆదివారం చిత్తూరు జిల్లా కలకడ సరిహద్దు వద్ద పోలీసులు ఆ లారీని తనిఖీ చేస్తుండగా కూలీలను గుర్తించారు. వారిని కలకడ ఆదర్శ పాఠశాలలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించి పునరావాసం కల్పించినట్లు స్థానిక ఎస్సై రవిప్రకాశ్రెడ్డి, తహసీల్దారు చిన్నయ్య పేర్కొన్నారు.
Courtesy Eenadu