ఇంటర్ మీడియట్ విద్యార్థుల చావుల కి భాద్యులు ఎవరు ? ఇది స్పష్టంగా ప్రభుత్వ తప్పిదమే అయినా విలువైన ప్రాణాలు పోవడం లో మనందరి పాత్ర కూడా ఉంది. ఎందుకు ఈ చైనా (చైతన్య , నారాయణ కాలేజిలు ) కాలేజిలని ని అరికట్టలేక పోతున్నాం? ఎందుకు తల్లి తండ్రులు , చదువుకున్న వారు, చదువుకొని వారు ఈ పిచ్చి రాంక్ ల వెంట పడి జీవితాలని నాశనం చేస్తున్నారు ? అసలు ప్రభుత్వ రంగంలో కాలేజీలు ఉండాలన్న ధ్యాస ఎవరికీ ఎందుకు ఉండట్లేదు ? ప్రయివేట్ కళాశాలలో మార్కులు , మార్కెట్ తప్ప మానవ విలువలకి స్తానం ఉందా ? విద్య విజ్ఞానం కోసమే , మానవ మనుగడ కోసమే అన్న ధోరణిలో భోధన జరుగుతుందా ? సమాధానం లేని ప్రశ్నలు గా మిగిలి పోతున్నాయి .
విద్యార్థి , ఉపాధ్యాయ పాత్ర లేనిదే తెలంగాణ ఉద్యమం లేదు , తెలంగాణ రాగానే అణచివేతనే అస్త్రంగా అందరి మీదా కేసులు . ఇప్పుడు ఏకంగా న్యాయం కోసం ప్రశ్నిస్తున్న విద్యార్థి తల్లి తల్లితండ్రుల్ని కూడా పోలీస్ స్టేషన్ లలో పెడుతున్నారు . ఇదేనా మనం కోరుకున్న త్యాగాల తెలంగాణా ?
ఇప్పుడు తెలంగాణ లో జరుగుతున్నా ఈ ఆత్మహత్యలు ఆగాలంటే వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపాట్టాలి . దోషులని శిక్షించాలి , ఫెయిల్ అయినా వారి పేపర్లు నిపుణులు, అనుభవజ్ఞులచే దిద్దించాలి . ఈ సంవత్సరం పరీక్షల నిర్వహణ ఆ గ్లోబరినా సంస్థ అధినేత కేటీఆర్ ఆప్త మిత్రుడు కాబట్టి ఇచ్చారు అన్న విషయం పై విచారణ చేపట్టాలి. చని పోయిన విద్యార్థుల కుటుంబాలకి నష్టపరిషారం చెల్లించాలి .