– కాశ్మీర్కు కలిసొచ్చిన ఆర్టికల్
– ఈ అధికరణం పెట్టుబడులను అడ్డుకోదు : నిపుణులు
న్యూఢిల్లీ : కాశ్మీర్కు ప్రత్యేక హౌదానిచ్చే అధికరణలు 35(ఏ), 370లను మోడీ సర్కారు రద్దు చేసిన వెంటనే దేశవ్యాప్తంగా పెద్దచర్చకు తెరలేసింది. ఈ అధికరణలపై భిన్నవాదనలు ఊపందుకున్నాయి. అయితే, ఆర్టికల్ 35(ఏ) జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి ఆటంకమని, ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులను ఈ అధికరణం అడ్డుకుంటున్నదని మోడీ సర్కారు చేస్తున్నవాదనల్లో పసలేదని తాజాగా పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాల ప్రకారం.. ఆర్టికల్ 35(ఏ) రాష్ట్రంలోని వ్యవసాయ సంబంధాల్లో విప్లవకర మార్పులను తీసుకొచ్చింది.
1950లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం.. ‘దున్నేవారిదే భూమి’ లాంటి సంస్కరణలు చేపట్టింది. రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యం కాదు. 1978నాటి వరకు ఆస్తి హక్కు ఆర్టికల్ 19 కింద ప్రాథమిక హక్కుగా ఉంది. 44వ సవరణతోనే ఆర్టికల్ 300(ఏ) కింద ఇది స్టేట్యుటరీ రైట్గా మార్పు చెందింది. ఆర్టికల్ 19(1)(ఎఫ్)ను పెద్దపెద్ద భూభాగాల రద్దు చట్టం,1950 ఉల్లంఘించకుండా ఆర్టికల్ 35(ఏ)నే కాపాడింది. రాష్ట్రంలో 1950 నుంచి 1973లో చేసిన భూ సంస్కరణలు, భారీ మొత్తంలో రుణాల మాఫీలతో గ్రామీణుల జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మానవ అభివృద్ధి సూచీలో దేశ సగటు కంటే జమ్మూ కాశ్మీర్ మెరుగ్గా ఉంది. దేశంలోని పేదరికం నిష్పత్తితో పోల్చినా ఈ రాష్ట్రానిది స్వల్పమే. సంపద పంపిణీ, వినియోగాల్లో దేశసగటుతో పోల్చితే ఈ రాష్ట్రానిదే పై చేయి. సంపదను సమంగా పంపిణీ చేసిన రాష్ట్రాల్లో కాశ్మీర్ మొదటి వరుసలో నిలిచింది. కాశ్మీర్లోని గ్రామీణ కుటుంబాల ఆదాయ అసమానతలు దేశంలోనే అత్యంత(0.221 ఆదాయ అసమానతల కో ఎఫిషెంట్) కనిష్టం. అప్పుల్లోనూ దేశ సగటు(31.44)తో పోల్చితే కాశ్మీర్లో తక్కువే(12.67). అప్పులు, ఆస్తుల నిష్పత్తిలో దేశ సగటు(3.23)తో పోల్చితే.. కాశ్మీర్ మెరుగ్గా(0.64) ఉంది. రాష్ట్రంలో ఆర్టికల్ 35(ఏ) సహాయంతో భూమిలేని నిరుపేద కూలీలుగా ఎవరూ లేకపోవడం గమనార్హం. దేశంలోని మొత్తం కార్మిక శక్తిలో వ్యవసాయ కూలీల సగటు 23శాతంగా ఉంటే.. కాశ్మీర్లో రెండు శాతానికి తక్కువే ఉన్నారు. కార్పొరేట్ పెట్టుబడులున్నాయని చెబుతున్న గుజరాత్లో ఈ సంఖ్య మరింత అధికంగా (33శాతం) ఉండటం విశేషం.
అధికరణం 35(ఏ) కారణం కాదు..
కాశ్మీర్లో బయటివారికి భూమిపై హక్కుల్లేకపోవడంతో పెట్టుబడులు రావడం లేదన్న వాదనలున్నాయి. ఈ కారణంతో పరిశ్రమలు, హౌటళ్లు, ప్రయివేటు విద్యా సంస్థలు, ఆస్పత్రులకు పెట్టుబడులు రావడం లేదని ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణలు అర్థరహితమని ఈ అధికరణలపట్ల సాధికారతగల నిపుణులు కొట్టిపడేస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోలాగే… కాశ్మీర్లోనూ బయటివారు, విదేశీ యులూ పెట్టుబడులు పెట్టొచ్చని వివరించారు. తక్కవ మొత్తంతోనే రాష్ట్రంలో పరిశ్రమలకు భూమిని 90ఏండ్లు లీజుకు తీసుకునే, మళ్లీ ఒప్పందాన్ని పునరుద్ధరించి కొనసాగించుకునే అవకాశాన్ని కాశ్మీర్ ప్రభుత్వం కల్పిస్తుంది. 1963లోనే బిర్లా గ్రూప్ అక్కడ చీనాబ్ టెక్స్టైల్స్ మిల్ను నెలకొల్పింది. 1990ల వరకు హౌటల్ ఒబెరారుగా పేరున్న నేటి ద గ్రాండ్ హౌటల్ శ్రీనగర్లో ఉంది. ఇండియన్ హౌటల్ గ్రూప్.. తాజ్ ప్రాపర్టీని నిర్వహిస్తున్నది. ఐటీసీ భాగస్వామ్యపద్ధతిలో పలు వెంచర్లను నడుపుతు న్నది. దేశంలోని ప్రతి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల(సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్)లో ప్రభుత్వ ఖజానా(ప్రజాధనం)ను పెట్టుబడులుగా పెట్టే పద్ధతితో అభివృద్ధి చెందుతున్నాయి. అయితే, ఇందులో కాశ్మీర్ వెనుకబడి ఉంది. దేశవ్యాప్తంగా 23లక్షల కోట్ల పెట్టుబడులతో 339 కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఉండగా.. అందులో రూ. 10.88లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇందులో కేవలం మూడు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు మాత్రమే జమ్మూ కాశ్మీర్లో ఉండటం గమనార్హం. అదీగాక, ఈ మూడింటిలో పెట్టిన పెట్టుబడులు కేవలం రూ. 165 కోట్లు కాగా.. ఉపాధి పొందుతున్నవారు 21 మంది మాత్రమే. భారత ప్రభుత్వ సంస్థలు ఆర్టికల్ 35(ఏ) ఆటంకాలనైతే ఎదుర్కొనలేదు. కేంద్ర ప్రభుత్వ సెక్యురిటీ, రెగ్యులేటరీ, అడ్మినిస్ట్రేటివ్లకు చెందిన కొన్ని బిల్డింగులు ఎలాంటి పేపర్వర్క్ లేకుండానే నిర్మించబడ్డాయి. అదీగాక, దాదాపు 53వేల ఎకరాల భూమి కేంద్ర భద్రతా బలగాలు అధీనంలో ఉన్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇలా ఉండగా.. 70 ఏండ్ల నుంచి ఈ రాష్ట్రంలో సర్కారు పెట్టుబడులు ఎందుకు పెట్టలేదు? నిజానికి భారత సర్కారు అక్కడ పెట్టుబడులు పెడితే పరిస్థితులు మరోలా ఉండేవి. ప్రభుత్వంతోపాటు ప్రయివేటు పెట్టుబడులు పెద్దగా రాలేవు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు ఇక్కడకు రాకపోవడానికి ప్రధాన కారణం ఐక్యరాజ్య సమితి ఈ ప్రాంతాన్ని వివాదా స్పదమైందని ప్రకటించడమే గానీ, ఆర్టికల్ 35(ఏ) కారణం కాదని కొందరు నిపుణులు వాదిస్తున్నారు.
Courtesy navatelangana