– న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు
ఇబ్రహీంపట్నం : తమ కులం వ్యక్తితో జరిగిన గొడవలో విధించిన జరిమానా చెల్లించలేదనే కారణంగా ఓ కుటుంబాన్ని కుల పెద్దలు బహిష్కరించారు. వారితో ఎవరూ మాట్లాడొద్దని, ఎలాంటి సహాయమూ చేయొద్దని తీర్మానించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని డబ్బా గ్రామంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. గోసంగి సామాజిక తరగతికి చెందిన రాసూరి చిన్న గంగారాం-లకిë దంపతులకు వారి కులంలోని ఓ వ్యక్తితో నెల కిందట గొడవ జరిగింది. అతను పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో కుల పెద్దలు కల్పించుకుని గంగారాంకు రూ.12వేల జరిమానా విధించారు. ఈ డబ్బులు తాను చెల్లించలేనని గంగారాం తేల్చి చెప్పడంతోపాటు పోలీసుస్టేషన్లో తనపై పెట్టిన కేసుకు సంబంధించి కోర్టు వరకు వెళ్లి వచ్చాడు. దీంతో తమ మాట వినకుండా వ్యతిరేకంగా వ్యవహరించావు.. జరిమానా చెల్లించలేదు.. అంటూ కులపెద్దలు ఈనెల ఒకటిన వారి కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. 3వ తేదీన రాసూరి చిన్న గంగారాం కుటుంబంతో ఎవరూ మాట్లాడొద్దని, ఎలాంటి సహాయ సహకారాలూ అందిం చొద్దని.. ఎవరైనా సహాయం చేస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో స్థానిక పోలీస్స్టేషన్లో ఈనెల 4న ఫిర్యాదు చేశారు.