-USFI రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి గారు
రాష్ట్రంలో 7 యూనివర్సిటీల పరిధిలో జరిగే (MPED) ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసే ప్రతిభగల క్రీడాకారులకు అధికారులు అన్యాయం చేస్తున్నారని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి గారు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం 100 మార్కుల ప్రశ్న పత్రాన్ని ఇచ్చి ఎలాంటి జాతీయస్థాయి క్రీడలలో పాల్గొన్న అనుభవం లేని వారికి మార్కులతో సీట్లు కేటాయించడం వల్ల భవిష్యత్తులో క్రీడాకారులు ఎలా తయారవుతారని అధికారులను ప్రశ్నించారు. క్రీడాకారులను ప్రాక్టికల్ గా ఎంతో ప్రతిభ కలిగినఅప్పుడు మాత్రమే భవిష్యత్తు క్రీడాకారులను తయారు చేయగలుగుతారూ అని తెలిపారు. కేవలం మార్కుల ద్వారా (MPED) సీట్లు కేటాయించడం సరైన పద్ధతి కాదని దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గతంలో డెబ్భై ఐదు మార్కుల ప్రశ్న పత్రం ఉండేదని 25 మార్కులు ప్రాక్టికల్ కు ఇచ్చేవారని కానీ ఈసారి కరోనా సాకుతో ఇలా ఎంట్రెన్స్ లో వంద మార్కులు పెట్టడం సరైంది కాదని దీనివల్ల ఎంతో కష్టపడి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అధికారులకు చిత్తశుద్ధి లేకపోవడం వలన ఇలాంటి విధానాలు తీసుకువస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరిపి పరీక్ష 75 మార్కులకు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరియు ఒకవేళ వంద మార్కుల కు పరీక్ష నిర్వహించిన విద్యార్థులకు 25 మార్కులను ఆడ్ చేసే విధంగా విధానాన్ని రూపొందించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను కలుపుకొని కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.