– ఉపా కింద 10 మంది కాశ్మీర్ యువత అరెస్టు
శ్రీనగర్ : లాక్డౌన్తో వచ్చిన ఖాళీ సమయంలో క్రికెట్ ఆడడమే ఆ యువకుల పాలిట నేరమయింది. వారందరినీ అరెస్టు చేయడంతో ఆ గ్రామంలో ప్రస్తుతం క్రికెట్ ఆడటమే మానివేశారు. ఇందుకు సంబంధిచిన వివరాలు… మృతి చెందిన తీవ్రావాది సయ్యద్ రూబన్ జ్ఞాపకార్థం జెర్సీలు ధరించి క్రికెట్ ఆడినందుకు 10 మంది యువకులపై ఉగ్రవాద నిరోధక చట్టం (యుఎపిఎ) కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన సంఘటన జమ్ముకాశ్మీర్లో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని షోపియాన్ నగరానికి సమీపంలోని నజ్నీన్పోరా గ్రామం వద్ద జీలం నది ఒడ్డున స్థానిక యువకులు ఆగస్టు 4న క్రికెట్ మ్యాచ్ ఆడారు. వీరిలో సయ్యద్ రూబస్ సోదరుడైన 24 ఏళ్ల సయ్యద్ తజముల్ కూడా ఉన్నాడు. ఈ మ్యాచ్ను రూబస్ జ్ఞాపకార్థం ఆడాలని తజముల్ భావించాడు. దీంతో జెర్సీల వెనక రూబస్ పేరు రాసి మ్యాచ్లో పాల్గొన్నారు. ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో తజముల్ ఆప్లోడ్ చేశాడు.
27 రోజుల తరువాత ఈ మ్యాచ్లో పాల్గొన్న 10 మందిపై యుఎపిఎలోని సెక్షన్ 13 ప్రకారం జమ్ముకాశ్మీర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 1న శ్రీనగర్లో తజముల్ను అరెస్టు చేశారు. ‘కేవలం మ్యాచ్ మాత్రమే ఆడామని, అక్కడ ఎలాంటి నినాదాలు, నిరసనలు చేయలేదని’ తజముల్ తెలిపాడు. తజముల్ ఎంబిఎ చేసి ప్రసుత్తం ఒక ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు.
ఈ కేసులో అరెస్టు చేసిన మరోక యువకుడు 22 ఏళ్ల ఉమెర్ ఫరూక్పై కూడా ఇప్పటి వరకూ ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు. స్థానికుల కథనం ప్రకారం ఈ కేసులో ఇప్పటి వరకూ 9 మందిని అరెస్టు చేశారు. వీరిలో 8 మంది విద్యార్థులే. మరోకరు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా క్రికెట్ ఆడడమే యువకులు నేరమయిందని స్థానికలు ఆరోపిస్తున్నారు.
Courtesy: NT