- కేసీఆర్ దళితులను మోసం చేస్తాడని ఎప్పుడో చెప్పా
- ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ
- నేలకొండపల్లి, కూసుమంచి, కొత్తగూడెంలో పర్యటన
నేలకొండపల్లి/కూసుమంచి/ కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్ : ప్రస్తుతం టీఆర్ఎస్ పెద్దల కళ్లు దళితుల భూములపై పడ్డాయని, చంద్రబాబు, ఇందిరాగాంధీల హయాంలో దళితులకు ఇచ్చిన భూములను ఇప్పుడు కేసీఆర్ లాక్కుంటున్నాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. నేలకొండపల్లి మండలం కోనాయగూడెం, కూసుమంచి, కొత్తగూడెంలో సోమవారం ఆయన పర్యటించారు. ఆయన వైకుంఠధామం నిర్మిస్తున్న దళితుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ దొరలకు పోయే రోజులొచ్చాయని, ‘దళితులకు మూడెకరాల భూమి’ పేరుతో ఓట్లను కొల్లగొట్టి వారిని మోసం చేసిన దగాకోరు కేసీఆర్ అని 11సంవత్సరాల క్రితమే తాను చెప్పానని గుర్తుచేశారు. దళితుల భూములను లాక్కోవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి భవిష్యత్తులో రాజకీయ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు ఇంకా ఏది కట్టాలన్నా ప్రభుత్వానికి దళితుల భూములే మొదట కనపడటం వి డ్డూరంగా ఉందన్నారు. అనంతరం ఆయన కొత్తగూడెం వెళ్లారు. ధర్నా చౌక్లో ఎమ్మా ర్పీ ఎస్ రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు. అనంతరం కొత్తగూడెం అంబేద్కర్ భవ న్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) ఆధ్వర్యంలో దివ్యాంగులతో స మీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్ఛార్జీ ఎస్కే. మదార్ సాహెబ్, జిల్లా అధ్యక్షుడు రమణయ్య, కార్యదర్శి దాసరి శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు సోమ య్య, ఎంఎస్ఎఫ్ ఇన్చార్జ్ దాసరి సారఽథి, జిల్లా నాయకులు వెంకన్న, రవీందర్, పరియర్, సిద్ధెల రవి, సతీష్, వీరయ్య, బాలస్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Courtesy Andhrajyothi