- నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో వెల్లడి
- 2019లో దేశవ్యాప్తంగా పెరిగిన బలవన్మరణాలు
న్యూఢిల్లీ : ఆర్థిక కష్టాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి సంఖ్య దేశవ్యాప్తంగా గత సంవత్సరం భారీగా పెరిగింది. 2018తో పోల్చితే 2019లో ఈ సంఖ్య 3.5 శాతం మేర పెరిగిందని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం.. తెలంగాణ 989 ఆత్మహత్యలతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. 1,526 కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానం ఆక్రమించగా.. 1,432 కేసులతో కర్ణాటక ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఆర్థిక కష్టాల వల్ల జరిగిన మొత్తం ఆత్మహత్యల్లో 67 శాతం కేసులు ఈ మూడు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. దేశంలో ఆత్మహత్యలకు ప్రధానంగా కుటుంబ సమస్యలే కారణమని, ఇందువల్ల 32.4 శాతం మంది ఉసురు తీసుకున్నారని ఎన్సీఆర్బీ తెలిపింది. 17.1 శాతం మంది ఆరోగ్య సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించింది.